భక్తి కథలు

బసవ పురాణం- 15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొర్రెను తాకావంటే బసవేశ్వరునిమీద ఒట్టు. శరణన్న జీవిని రక్షించడం శివభక్తుల వ్రతం అన్నాడు.
దానికి విటుకు కోపించి బ్రహ్మయ్యమీదికి కత్తినెత్తాడు. అది చూచి బ్రహ్మయ్య రుద్రాకారుడై ఒకే దెబ్బతో విటుణ్ణి రెండు ముక్కలు చేశాడు. మాట తప్పిన వాడి తల ఇందుండకూడదన్నట్లు ఎగిరి గుడికవతల పడింది విటుని తల.
ఈ విషయం రాజుకు తెలిసింది. బిజ్జలునికి కోపం వచ్చింది. ఎవడైనా ఒక గొర్రె కోసం మనిషిని చంపుతాడా? శివభక్తులు దయాపరులని అంటూంటావే బసవయ్యా! నిరపరాధిని ఇలా చంపడమేనా భక్తి? ఈ భూమిమీద వీరు మనుషులను బ్రతుకనిచ్చేటట్లు లేదు. లేకుంటే మీకు గొర్రెతో ఏం పని?’’ అని తీవ్రంగా బసవేశ్వరుణ్ణి చూచి అన్నాడు.
బసవన్న ఈ మాటలు విని చిరునవ్వు నవ్వాడు. ‘ఎందుకలా నవ్వుతావు బసవయ్యా! మీ ధర్మాలు నాకు తెలిశాయిలే! కాలదన్నడం, మాంసఖండాలు పెట్టడం, కొడుకును
చంపడం, రాళ్ళతో కొట్టడం, కులభ్రష్టత్వం చెంది భుజించడం, తండ్రిని చంపడం, భార్యనివ్వడం, ఇవేగా మీ ప్రాచీన శివభక్తుల ధర్మాలు. ఈ ధర్మపరంపరకు నేడు గొర్రె కోసం మనిషిని చంపే ధర్మం కూడా వచ్చి చేరింది. ఈ రాజ్యమేలడం ఇక నావల్ల కాదు’ అని బిజ్జలుడు క్రోధంతో అన్నాడు.
అప్పుడు బసవేశ్వరుడు ‘‘ప్రభూ! మీరు తొందరడవద్దు. శివభక్తులు ఎన్నడూ ధర్మం తప్పి చరించరు. అందులోనూ కిన్నర బ్రహ్మయ్య సామాన్యుడా? సాక్షాత్తు శివస్వరూపం, ఎవరో చెప్పిన మాటలు విని తొందరపడి ఎద్దు ఈనిందంటే గాట కట్టేయమన్నట్లు నీవు మాట్లాడుతున్నావు. న్యాయమూర్తులను పంపు ముందు. జరిగిదేమిటో పూర్తిగా విచారించు. తర్వాత ఒక నిర్ణయానికి వద్దాము’’ అన్నాడు.
‘సరే’నని బిజ్జలుడు తన ప్రధానులను గుడివద్దకు పంపాడు. వారువెళ్లి అక్కడే వున్న కిన్నర బ్రహ్మయ్యకు నమస్కరించి ‘‘స్వామీ! మీ వంటి మహభక్తుడు హింసకు లోబడడానికి కారణమేమిటో మేము ఊహించలేకపోతున్నాము. లోకంలో మీకు ఎంతో అపకీర్తి వచ్చిందిప్పుడు. ఏమి జరిగిందో చెప్పండి’’ అని ప్రార్థించారు.
అప్పుడు కిన్నర బ్రహ్మయ్య జరిగినదంతా వివరించి చెప్పాడు.
‘‘శరణుకోరి వచ్చిన గొర్రెను వేయి మాడలిచ్చి కొని దానికి శివలాంఛనాలు దిద్దాను. దానితో గొర్రె నంది అయినట్టే లెక్క. అట్లాంటిది మాట తప్పి ఈ విటుడు మళ్లీ వచ్చి నందీశ్వరుణ్ణి గుంజుకుపోతుంటే చంపాను. ఇందలి తప్పొప్పులకు ఈ త్రిపురాంతకుడే సాక్షి! కావాలంటే ఆయననే అడగండి. చూస్తున్నాడు మా కథనంతా గర్భగుడిలోనుండి’’ అన్నాడు బ్రహ్మయ్య.
ప్రధానులు ఈ మాటలు రాజుతో చెప్పారు. అది విని రాజు నివ్వెరపోయి ‘‘నిజంగా త్రిపురాంతకుడే స్వయంగా ఈయనకు సాక్ష్యం చెపుతాడా? ఎన్నడూ ఇలాంటిది కనీ వినీ ఎరుగమే! అదీ చూద్దాము. స్వామివారిని అలాగే సాక్ష్యం చెప్పమను’’ అన్నాడు బిజ్జలుడు.
అంతా దేవాలయం వద్దకు చేరారు. ముందుగా బసవన్న కిన్నర బ్రహ్మయ్యకు పాదాభివందనం చేసి ఎన్నో విధాల ప్రస్తుతించాడు.
అందరూ గుడిలోపలికి వెళ్లారు. ఈ విషయం తెలిసిన నగర ప్రజలు కూడా గుంపులు గుంపులుగా గుడి నిండా మూగారు. గర్భగుడి అప్పుడు మూసి ఉంది. కిన్నర బ్రహ్మయ్య గుడి తలుపులవైపు ఒకసారి చిరునవ్వు నవుతూ చూచాడు. వెంటనే తాళాలు లేకుండానే తలుపులు తెరుచుకున్నాయి. అది చూచి ప్రజలంతా దిగ్భ్రాంతులైనారు.
కిన్నర బ్రహ్మయ్య గర్భగుడిలో నిలబడి ‘‘త్రిపురాంతకా’’ అని గొంతెత్తి పిలిచాడు. ‘ఓరుూ భక్తుడా!’ అని లింగం నుండి ధ్వని వచ్చింది. అది విని ప్రజలంతా గడగడా వణికిపోయారు. భూమండలం అటూ ఇటూ ఊగినట్లనిపించింది. లింగస్థులు కాని ఇతరులంతా మూర్ఛిల్లారు. అప్పుడు బసవన్న కిన్నర బ్రహ్మయ్యకు సాష్టాంగ ప్రణామం చేసి ‘బ్రహ్మయ్యా! నీవు మానవుడవు కావు. సత్యగంభీరుడవు. జగదాధారుడవు. శివ స్వరూపుడవు’’ అని స్తుతించాడు. అప్పుడు బ్రహ్మయ్య చిరునవ్వు నవ్వి ‘త్రిపురాంతకా!’ మళ్లీ పిలిచాడు. ఆ పరమేశ్వరుడు ‘ఓరుూ!’ అని మళ్లీ బదులు పలికాడు. తల్లక్రిందులైన సృష్టి మళ్లీ యధాస్థితికి వచ్చింది.
బిజ్జలునితోసహా అందరికీ మళ్లీ స్పృహ వచ్చింది. బిజ్జలుడు బ్రహ్మయ్యకు సాష్టాంగపడి ‘‘బ్రహ్మయ్యా! మేము అజ్ఞులము. మమ్ము మన్నించి కరుణించు తండ్రీ’’ అని బ్రహ్మయ్యను ప్రార్థించాడు.
అప్పుడు బ్రహ్మయ్య ‘రాజా! ఒక్క శివభక్తులకు మాత్రం వెరచివుండు. చాలు. నీ రాజ్యానికి ఏమీ కష్టం కలుగదు’ అని చెప్పాడు. రాజుతో సహా అంతా త్రిపురాంతకుని గుడినుండి తిరిగి తమ తమ నివాసస్థానాలకు వెళ్లిపోయాడు.
కలకౌత బ్రహ్మయ్య కథ
కల్యాణ నగరంలో కలకౌత బ్రహ్మయ్య అనే శివ భక్తుడొకడు ఉన్నాడు. ఆయన ఒక చేత కొమ్ము, మరొక చేత కోల ధరించి ఇంద్రజాలికుని వేషం వేసుకొని శక్తుల ఇళ్ళకుపోయి వారిని నవ్విస్తూ జంగమకోటిని సేవిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక జంగమయ్య కిన్నర బ్రహ్మయ్యగారిని దర్శించుకొందామని ఎంతోదూరం నుండి వచ్చి వచ్చి ఇక సాగలేక కూలబడిపోయాడు. శ్రమతో అతడు అలసిపోయి పడ్డచోట కలకౌత బ్రహ్మయ్య ఉన్నాడు.
- ఇంకా ఉంది

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్