పశ్చిమగోదావరి
సైపాన్లోకి చనిపోయిన ఒడుగు చేపలు ప్రత్యక్షం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 18 May 2016
మొగల్తూరు, మే 17: మొగల్తూరు-కెపి పాలెం గ్రామాల మధ్యగల వెస్ట్కుక్కల్ డ్రెయిన్ నుండి సైపాన్లోకి ఒడుగు జాతికి చెందిన చేపలు చనిపోయి పంట కాలువలోకి కొట్టుకు వచ్చాయి. ఈ చేపలు చాలా అరుదుగా ఉంటాయని, చప్ప నీటితో ఈ చేపలు బతుకుతాయని పలువురు మత్య్సకారులు తెలిపారు. సైపాన్కు చనిపోయిన అయిదు ఓడుగు చేపలు కొట్టుకు వచ్చాయని, ఒక్కొక్కకటి అయిదు కేజీల బరువు ఉన్నాయని, ఒక్కో చేప ధర రూ.వెయ్యి ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ చేపలు చనిపోయి మూడు రోజులు అవుతుందని వారు చెప్పారు.