రంగారెడ్డి
రాడ్తో కొట్టి భర్తను హతమార్చిన భార్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సైదాబాద్, మే 23: తాగిన మత్తులో భర్తను అతిదారుణంగా ఓ మహిళ హత్యచేసిన సంఘటన సైదాబాద్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా గౌరారంకు చెందిన వెంకటేశ్, సుగుణ దంపతులు. బ్రతుకుదెరువు కోసం నగరానికి వచ్చి చింతలబస్తీలో నివాసముంటున్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వెంకటేశ్కు ఆరు నెలల క్రితం ప్రమాదంలో కాలు విరిగింది. అప్పటి నుండి కుటుంబ భారం మొత్తం భార్య సుగుణపై పడింది. దీంతో ఇద్దరి దంపతుల మధ్య తరచూ గొడవలు ఉండేవి. ఆదివారం రాత్రి ఇద్దరు దంపతులు కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో కోపంతో రెచ్చిపోయిన భార్య సుగుణ భర్త వెంకటేశ్పై విరుచుకుపడి ఇంట్లో ఉన్న ఓ రాడ్తో భర్త తలపై కొట్టడంతో వెంకటేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయాన్ని భార్య సుగుణ గోప్యంగా ఉంచింది. సోమవారం ఉదయం విషయం తెలుసుకున్న స్థానికులు సైదాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఏసిపి సుధాకర్ పోలీసులతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.