రంగారెడ్డి
బంగారు తెలంగాణ దిశగా అధికారులు కృషి చేయాలి: జెసి సైనీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 3 June 2016
హైదరాబాద్, జూన్ 2: ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమించి బంగారు తెలంగాణ దిశగా జిల్లా అధికారులు కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రజత్కుమార్ సైనీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని జేసి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పేద ప్రజలదరికి చేరేలా అధికారులు కృషి చేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరి బంగారు తెలంగాణకు అడుగులు వేసిన వారమవుతామన్నారు.