నిజామాబాద్
15లోగా దరఖాస్తు చేసుకోవాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 4 June 2016
ఇందూర్, జూన్ 3: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన 2014 జూన్ 2వ తేదీ లోపు సాదాబైనామీల ద్వారా కొనుగోలు చేసిన భూములను ఉచితంగా రెగ్యులరైజేషన్ చేసుకునేందుకు ఈ నెల 15లోగా మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సన్న, మధ్యతరహా రైతులు సాదాబైనామీల ద్వారా కొనుగోలు చేసిన ఐదు ఎకరాల వరకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 153ను విడుదల చేయడం జరిగిందన్నారు. వ్యవసాయ భూములకు మాత్రమే సాదాబైనామీల ఉచిత రెగ్యులరైజేషన్ నిబంధనలు వర్తిస్తాయని అన్నారు. దరఖాస్తుదారులు మీసేవా కేంద్రాల్లో 35రూపాయల సర్వీసు చార్జీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.