మెయన్ ఫీచర్

దాష్టీకాలు భరిస్తూ దౌత్యబంధం ఎన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్‌పై కక్షగట్టిన పాకిస్తాన్ ఇటీవల ఒక వ్యూహానికి శ్రీకారం చుట్టింది. కేరళలో వామపక్షాలు, ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్, హిందూ వ్యతిరేక పార్టీలు, తమిళనాడులో డిఎంకె, హైదరాబాద్‌లో మజ్లిస్, యుపిలో బిఎస్‌పి, ఎస్.పి, ఢిల్లీలో కేజ్రీవాల్ ఇలా హిందూత్వ వ్యతిరేక శక్తులను, వ్యక్తులను ఒక తాటిపైకి తీసుకువచ్చి మైనారిటీల పేరిట ముస్లింలను, క్రైస్తవులను కలిపి మోదీ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం మొదలుపెట్టింది. పాకిస్తాన్ కుటిల వ్యూహానికి మణిశంకర్ అయ్యర్, దిగ్విజయ్ సింగ్, కపిల్ సిబల్, ఒవైసీ సోదరులు, ఏచూరి సీతారాం, స్టాలిన్ వంటి నేతలు ఆమోదం చెబుతారు. భారత్‌పై పాక్, చైనాలు ద్విముఖ వ్యూహంతో దాడి చేయవచ్చునన్న కుట్రను బిజెపి నాయకత్వం పసికట్టకపోలేదు. అందుకని యుపిలో రీటా బహుగుణ , జగదంబికా పాల్, ఎపిలో పురంధ్రేశ్వరి, తమిళనాడులో జయంతి నటరాజన్ వంటివారిని తమ పార్టీలో చేర్చుకోసాగింది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుతో జతకట్టింది. తెలంగాణలో మజ్లిస్‌తో పొత్తుపెట్టుకున్న టిఆర్‌ఎస్ మీద యుద్ధం ప్రకటించింది. కొంతమంది బిఎస్‌పి అగ్ర నాయకులను మాయావతికి దూరం చేసింది. రాహుల్ గాంధీని రాజకీయంగా ఏకాకిని చేసే ప్రయత్నం మొదలైంది. మరోవైపు పాక్ ఆగడాలకు కళ్లెం వేసేందుకు మరిన్ని సర్జికల్ స్ట్రయిక్స్‌కు మన సైన్యం సిద్ధంగా ఉంది. ఇప్పటికే సరిహద్దుల్లో పాక్ రేంజర్లు మట్టికరుస్తున్నారు. ఇలాంటి సమయంలో భోపాల్ వద్ద సిమి ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్‌లో మరణిస్తే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ - ‘పాపం ముస్లిములు చనిపోయారు..’అని మొసలి కన్నీరు కార్చటం దేశద్రోహం కాదా?
‘ఒకే ర్యాంక్- ఒకే పెన్షన్’ నినాదంతో ఒక సైనికుడు దిల్లీలో ఆత్మహత్య చేసుకున్న ఉదంతాన్ని రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, రాజీవ్ దేశాయ్, అజయ్ మాకన్, దిగ్విజయ్ సింగ్ వంటివారు రాజకీయ లబ్ధికోసం వాడుకోవటం దారుణం. జాతి మొత్తం సమైక్యంగా ఉండాల్సిన సమయంలో ప్రతి సంఘటననూ విపక్ష నేతలు రాజకీయం చేస్తున్నారు. భోపాల్ ఘటననే కాదు, మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ను కూడా రాజకీయం చేస్తున్నారు. కాగా, అమెరికా కార్యనిర్వాహక అండర్ సెక్రటరీ ఆడం జూబిక్ ఆమధ్య మాట్లాడుతూ, ‘పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను స్వయంగా ఆ దేశం ధ్వంసం చేయాలి. లేకుంటే మేమే రంగంలోకి దిగుతాం’- అని హెచ్చరించటం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. అంటే పాకిస్తాన్‌తో ప్రత్యక్ష యుద్ధానికి అమెరికా సిద్ధంగా ఉన్నదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇరాక్‌పై జరిపిన దాడుల వంటివే అమెరికా జరిపితే దక్షిణ ఆసియాలో అగ్రరాజ్యం ప్రాబల్యం పెరగడమూ, చైనా ఇరకాటంలో పడటమూ జరుగుతుంది.
ఇండియాలోని పాకిస్తాన్ హైకమిషనర్ ఆఫీసులో పనిచేసే మహమ్మద్ అక్తర్ గూఢచర్యానికి పాల్పడుతున్నాడని తేలడంతో ఆయనతోపాటు మరో ఇద్దరు ఐఎస్‌ఐ గూఢచారులను దేశం విడిచిపోవలసిందిగా భారత ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు పాక్ ప్రతీకార చర్య తీసుకుంది. ఇలాంటి దశలో పాక్ హైకమిషన్‌ను మూసివేయటం మంచిదన్న వాదనలు బలపడుతున్నాయి. పాక్‌కు అండగా నిలుస్తున్న చైనా కూడా మన దేశంలో విధ్వంసక చర్యలకు మద్దతు పలుకుతోంది. చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా, ఉభయ తెలుగురాష్ట్రాల్లో మావోయిస్టులకు చైనా సర్కారు అన్ని విధాలుగా అండదండలిస్తోంది. దేశంలో ఎక్కడ మావోయిస్టులు విధ్వంసక చర్యలకు పాల్పడినా- అవన్నీ చైనా ప్రత్యక్షంగా చేయిస్తున్న సంఘటనలే. అలాంటి దేశంతో మనకు వ్యాపార సంబంధాలేమిటి? భారత్ ఎంతగా సంయమనం పాటిస్తున్నా పాక్, చైనాలు మాత్రం వక్రబుద్ధులను మార్చుకోవు. మన దేశంలోని విశ్వవిద్యాలయాల్లోనూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు జిహాదీ సంస్థలు ఆజ్యం పోస్తున్నాయి. వీటన్నింటికీ సూత్రధారి పాకిస్తాన్ అని వేరే చెప్పనక్కర్లేదు. భారత్‌లో ఉగ్రవాదానికి పాక్, తీవ్రవాదానికి చైనా ఊతం ఇస్తున్నాయి. గనుక మన దేశంలో వీటి రాయబార కార్యాలయాలను మూసివేయడం ఉత్తమం. పాక్, చైనా ఆగడాలను అనునిత్యం భరించడం కన్నా, ఈ రెండు దేశాలతో దౌత్య, వాణిజ్య సంబంధాలను తెంచుకోవడం శ్రేయస్కరం.
అరుణాచల్ ప్రదేశ్‌లో దలైలామా పర్యటించడానికి భారత్ తన ఆమోదాన్ని తెలిపింది. అందుకు చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. కారణం టిబెట్ తమ ఆధీనంలో ఉంది కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ కూడా తమదేనని వారి వాదం. గతంలో అప్పటి రాష్టప్రతి ప్రతిభాపాటిల్ , రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లినప్పుడు చైనా అభ్యంతరాలను వ్యక్తంచేసింది. ఇటీవల దీపావళి సందర్భంగా చైనా టపాసులను వినియోగించరాదని భారత ప్రజలు ఉద్యమించడం కూడా ఆ దేశానికి ఆగ్రహం తెప్పించింది. భారత్‌తో వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకుంటామని చైనా హెచ్చరించింది. నిజంగా అదే జరిగితే చైనాయే ఆర్థికంగా నష్టపోతుంది. ఎందుకంటే చైనా నుండి ఇండియాకు జరిగే ఎగుమతులు చాలా ఎక్కువ. చైనాతో భారత్ సఖ్యతగా ఉండే అవకాశం లేదు. తీవ్రవాద సంస్థలను ఉపయోగించుకొని భారత్‌ను అస్థిరపరిచేందుకు చైనా ప్రయత్నిస్తోంది. భారత్‌ను దెబ్బతీసి, దక్షిణ ఆసియాలో ఏకచ్ఛత్రాధిపత్యం సాధించాలని చైనా ఉవ్విళ్లూరుతున్నది. ఈ ఉద్దేశంతోనే మావోలను రెచ్చగొడుతోంది. బాక్సైట్ ఉద్యమాల నేపథ్యంలో గిరిజనుల్లో అశాంతిని రాజేసేందుకు మావోయిస్టులను చైనా ఉసిగొల్పుతోంది. అంటే చైనా ధనుస్సులో దండకారణ్య వనరులు బాణాలు. మావోయిస్టులకు కావలసిన అత్యాధునిక మారణాయుధాలు కూడా చైనా నుండే సరఫరా అవుతున్నాయి.
మహాభారత కాలంలో కౌరవులు పాండవులకు అపకారం చేశారు. రామాయణ కాలంలో రావణుడు దుర్మార్గాలు చేశాడు. చారిత్రక యుగంలో గజిని ఘోరీ నాదిర్షాలు నరహంతకులైనారు. ఇరయ్యవ శతాబ్దంలో హిట్లర్, స్టాలిన్, మావోలు రక్తపుమడుగులు పారించారు. ఇవన్నీ మనకు తెలుసు. మరి నేటి కంప్యూటర్ యుగంలో మనకన్నుల ముందే చైనా, పాకిస్తాన్‌లు చేస్తున్న దుర్మార్గాల మాటేమిటి? ఈ రెండు దేశాలకూ మద్దతునిచ్చేవారి సంఖ్య ఎక్కువగానే ఉండటం ఏమిటి? పాకిస్తాన్ వాహిబ్ జిహాదీయత్ ఉగ్రవాద మత దేశం. చైనా వర్గ ఉగ్రవాద దేశం. ఈ రెండు దేశాలల్లోనూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాలకు బదులు సైనిక నియంతృత్వమే ఆధిపత్యం సాగిస్తున్నది. ఈ రెండు దేశాలకూ అనుకూల వర్గాలు ఇండియాలో ఉండటం ఏమిటి? కాంగ్రెస్ సహా కొన్ని విపక్ష పార్టీల నేతలు పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడడం ఏమిటి? ‘్భరతమాతాకీ జై’ అన్న వారిని వీరు దేశద్రోహులంటున్నారు. భారత్‌లో దుశ్చర్యలకు పాల్పడినవారికి అండగా ఉంటున్నారు. ఇలాంటి నేతల వల్లే జాతి సమైక్యతకు గండి పడుతోంది.
ఇపుడు- ‘్భరతదేశాన్ని రక్షించండి’ అని పిలుపునిచ్చిన దేశ భక్తులను ‘వార్ హూంగర్స్’ (యుద్ధోన్మాదులు) అంటున్నారు. మరి చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్, సిరియా వంటి దేశాలు యుద్ధోన్మాదాన్ని సృష్టించి ఎగుమతి చేస్తున్నాయి కదా? అలాంటి దేశాలను ఎవరూ విమర్శించడం లేదేమిటి? నరహంతక ఉగ్రవాది మసూద్ అజర్ ‘సత్పురుషుడు’ అని చైనా కితాబునివ్వటం ఏమిటి? ఇండియాకు వ్యతిరేకంగా ఐరాసలో చైనా ‘వీటో’ ఉపయోగించటం ఏమిటి? ‘చైనా మా చైర్మన్’ అంటూ మన దేశంలో మావోయిస్టులు నినాదాలు ఇవ్వటం ఏమిటి? ‘నరేంద్ర మోదీయే మా నాయకుడు’ -అని చైనాలో ఎవరైనా నినాదాలిస్తున్నారా? లేదుకదా? మరి ఈ దరిద్రం కేవంల ఇండియాకే ఎందుకు పట్టింది?
భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటీషు వ్యతిరేకత అనే నకారాత్మక భావం అందరినీ కలిపింది. స్వాతంత్య్రం వస్తే ‘పాలనదులు ప్రవహిస్తాయి’ అని అంతా భావించారు. ఐతే- అసలు భారతదేశం ఎందుకు స్వాతంత్య్రం కోల్పోయింది? అని ఆలోచించినవారు తక్కువ. జాతిలో సమైక్యత లేకపోవటం వల్ల ఏడువందల సంవత్సరాలు విదేశీయుల చేత పరిపాలింపబడింది. ఇవాళ జరుగుతున్నదేమిటి? మళ్లీ అదే అనైకమత్యం ఇప్పుడు కన్పడుతున్నది. అంటే- హిందువులు తమ స్వాతంత్య్రాన్ని నిలుపుకోలేరు.. అని అర్థమా?
అక్టోబరు రెండవ వారంలో గోవాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో చైనా, శ్రీలంక, రష్యా వంటి దేశాలు పాల్గొన్నాయి. ఇక్కడ ఇండియా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రష్యా కొద్దికాలంగా ఇండియామీద అలకతో ఉంది. కారణం- అమెరికా సహా యూరప్ దేశాలు ఇండియాకు దగ్గర కావటమే. ఆయుధ సంపత్తిని అమెరికా, ఫ్రాన్సుల నుండి భారత్ కొనుగోలు చేయటం. ఈ నేపథ్యం దృష్ట్యా ఇండియా రష్యాతో భారీ ఆయుధ ఒప్పందాలు చేసుకున్నది. ఇక రెండవ అంశం చైనాతో నిక్కచ్చిగా మాట్లాడటం. ‘పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశం అని గుర్తించండి’అని భారత్ తెగేసి చెప్పింది. ఐతే- చైనా ప్రతిక్రియ అందరూ అనుకున్నట్లే ఉంది. పాక్‌తో మైత్రిని వదులుకోవడానికి నైసర్గిక ఆర్థిక కారణాల దృష్ట్యా చైనా సిద్ధంగా లేదు. ఇది భారత రక్షణకు ప్రమాదకరం. టిబెట్ జల వసతుల మీద చైనా ఆధారపడి ఉంది. పాకిస్తాన్ చైనాకు వలస దేశం. పాక్ ప్రేరిత జిహాదీ ఉగ్రవాదానికి చైనా అంతర్జాతీయంగా కొమ్ముకాస్తున్నది. ఇందుకు ఎనె్నన్నో సాక్ష్యాలున్నాయి. భారత్ ఇప్పటికీ ఆయుధాల కోసం విదేశాలపైనే ఆధారపడుతోంది. వివిధ దేశాలతో ఆయుధాల సరఫరా విషయమై భారత్ ఒప్పందాలు చేసుకుంటోంది. దీంతో పాక్, చైనాలు భారత్‌ను చులకనగా చూస్తూ ప్రతీకారంతో రగిలిపోతున్నాయి.
ఇక్కడ ఓ చారిత్రక అంశాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. హిరోషిమా, నాగసాకీలపై అణుబాంబులు పడిన తర్వాత జపాన్ ఆయుధ సంపత్తిని సమకూర్చుకొనకూడదని 1945 తర్వాత నిషేధాన్ని విధించారు. ఈ శాపాన్ని జపాన్ వరంగా మార్చుకుంది. తన సంపద మొత్తం దేశాభివృద్ధి కార్యకలాపాలకు ఉపయోగించుకున్నది. రక్షణ విషయంలో నాటో కూటమిలో చేరింది. అంటే జపాన్‌ను కాపాడే బాధ్యత నాటో దేశాలపై పడింది- ఇది విచిత్రంగా ఉంది కదూ!

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్