మద్నూర్ మండలంలో నీటమునిగిన గ్రామాలు
Published Saturday, 24 September 2016నిజామాబాద్ : మద్నూర్ మండలంలో లెండివాగు ఉధృతికి ఎన్గురా, ఇలుగాం, కుర్ల, గోజేగాం, మదన్ ఇప్పర్గా గ్రామాలు శనివారం నీట మునిగాయి. భారీ వర్షాలకు వందల ఎకరాల్లో పంటపొలాలు నీటి మునిగాయి. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.