ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో తగ్గిన మాతాశిశు మరణాలు
Published Saturday, 24 September 2016శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 23: రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపించడం వల్లే మాతాశిశు మరణాలు బాగా తగ్గాయని వైద్య ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం శ్రీ కాళహస్తి ఏరియా ఆసుపత్రిలో జరిగిన డయాలసిస్ కేంద్రం ప్రారంభోత్సవంలో అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితోపాటు మంత్రి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతాశిశు మరణాలలో రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా ఉండేదని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపించడం వల్ల మాతాశిశు మరణాలు బాగా తగ్గాయని తెలిపారు.