లిబియా నుంచి హైదరాబాద్ చేరుకున్న ప్రొఫెసర్లు
Published Saturday, 24 September 2016హైదరాబాద్: ఏడాదికి పైగా లిబియాలో ఉగ్రవాదుల నిర్భందంలో ఉండి ఇటీవలే విడుదలయిన ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లు గోపీకృష్ణ, బలరామకిషన్ శుక్రవారం అర్థరాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. గతేడాది జులై 29న వీరిద్దరినీ ఉగ్రవాదులు అపహరించిన సంగతి తెలిసిందే. నాచారం రాఘవేంద్ర కాలనీలోని స్వగృహానికి గోపీకృష్ణ, తిరుమలగిరిలోని స్వగృహానికి బలరాంకిషన్ చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.