పాడేరు ఘాట్లో విరిగిపడిన కొండ చరియలు
Published Saturday, 24 September 2016పాడేరు, సెప్టెంబర్ 23: పాడేరు ఘాట్లో శుక్రవారం కొండ చరియలు విరిగి పడడంతో దాదాపు ఏడు గంటల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. గత కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఘాట్లోని రాజ్పురం వద్ద కొండ చరియలు విరిగి ప్రధాన రహదారిపై పడ్డాయి. శుక్రవారం ఉదయం పదకొండు గంటల సమయంలో ప్రధాన రహదారిపై కొండ చరియలు పడడంతో మైదాన ప్రాంతం నుంచి పాడేరు వైపు, పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి వెళ్లే అన్ని రకాల వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుకు అడ్డం గా పడిపోయిన కొండ చరియల వలన వాహనాలు వెళ్లేందుకు ఏ మాత్రం దారి లేకపోవడంతో ఘాట్లో వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరి ఉండిపోవలసి వచ్చింది.