తెరాసతో కాంగ్రెస్ కుమ్మక్కు: రేవంత్
Published Tuesday, 31 May 2016హైదరాబాద్: తెలంగాణలో అధికార తెరాస పార్టీతో కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నట్లు రాజ్యసభ ఎన్నికలే నిదర్శనమని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయకపోవడం పెద్ద తప్పు అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసి ఉంటే ఇటీవల తెరాసలోకి ఫిరాయించిన ఆ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడి ఉండేదన్నారు. ఈ కోణంలో ఆలోచిస్తే తెరాసతో కాంగ్రెస్ కుమ్మక్కయినట్టు స్పష్టంగా అర్థమవుతోందన్నారు.