-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
బర్మింగ్హామ్, ఆగస్టు 1: ఇంగ్లాండ్తో తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లోనే భారత్ ఆశలు పెంచేసింది. ఇన్నింగ్స్ తొలి రోజే ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చింది. స్పిన్నర్లకు పిచ్ అనుకూలమన్న అంచనాలను ఖాయం చేస్తూ అశ్విన్ మ్యాచ్ను మెలితిప్పాడు. అశ్విన్కు సహకరిస్తూ షమి సైతం ఇంగ్లాండ్ను కట్టడిచేశాడు.
న్యూఢిల్లీ, ఆగస్టు 1: టీ-20 చాలెంజర్ ట్రోఫీకి బీసీసీఐ బుధవారం మహిళా జట్లను ప్రకటించింది. ఇండియా బ్లూ, ఇండియా రెడ్, ఇండియా గ్రీన్ జట్లకు వరుసగా మిథాలీ రాజ్, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తిలు నాయకత్వం వహిస్తారు. సీనియర్ మహిళల టీ-20 చాలెంజర్ ట్రోఫీ ఆగస్టు 14 నుంచి 21 వరకూ కర్నాటకలోకి ఆలూర్లో జరగనుంది.
నాన్జింగ్ (చైనా): ప్రఖ్యాత బిడబ్యుఎఫ్ ప్రపంచ చాంపియన్షిప్ టోర్నీలో భారత టాప్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీధర్లు ప్రత్యర్థులపై సునాయాస విజయాలతో మలి అంకంలోకి అడుగుపెట్టారు. గత టోర్నీల్లో రజితం, కాంస్య పతకాలు సాధించిన సైనా మంగళవారం రెండో రౌండ్లో టర్కీకి చెందిన ప్రత్యర్థి అలియె డెమిర్బాగ్పై 21-17, 21-8 స్కోరుతో సునాయాస విజయం సాధించింది.
బర్మింగ్హామ్, జూలై 31: నిజానికి ఇంగ్లాండ్కు తాజా టెస్ట్ చారిత్రాత్మకం. ట్రిపుల్ నైన్ రికార్డుదాటి ఫోర్ డిజిట్ టెస్ట్ రికార్డును ఘన విజయంతో లిఖించాలన్న ఉత్సాహంతో ఇంగ్లాండ్ జట్టు కనిపిస్తోంది. ఇంగ్లీష్ సంబరాలకు చెక్ పెట్టి అచ్చిరాని క్రికెట్ మక్కాలో అద్భుత గెలుపు సాధించాలన్న ప్రణాళికను టెస్ట్ టాపర్ భారత్ సిద్ధం చేస్తోంది. ఇంగ్లాండ్ గడ్డపై భారత్కు టెస్ట్ సిరీస్ విజయం చేకూరి దశాబ్దం దాటుతోంది.
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ క్రీడాకారిణి కర్మన్ కౌర్ కొత్త రికార్డు సృష్టించుకుంది. ప్రపంచ టెన్నిస్ ర్యాంకుల్లో 32 స్థానాలు అధిగమించి టాప్ -200కు చేరిన ఆరో భారత క్రీడాకారిణిగా రికార్డు సాధించింది. గత ఏప్రిల్లో అంకిత రైనా టాప్-200 ర్యాంకును చేధించి 195వ స్థానంలో నిలవడం తెలిసిందే. వీరిద్దరికంటే ముందు సానియా మీర్జా, నిరుపమా వైద్యనాథన్, శిఖా ఓబెరాయ్, సునీతారావులు టాప్-200లోపు ర్యాంకులు సాధించారు.
నాన్జింగ్ (చైనా), జూలై 30: బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్షిప్ టోర్నీలో ఆరంభంలోనే అకుంఠిత పోరుసలిపిన భారత షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ శుభారంభం పలికారు. న్యూజిలాండ్ షట్లర్ అభినవ్ మనోటా, ఫ్రాన్స్ క్వాలిఫయర్ లూకాస్ కార్వీలను స్ట్రెయిట్ గేమ్లో మట్టికరిపించి ప్రఖ్యాత టోర్నీలో రెండో రౌండ్కు చేరుకున్నారు.
దుబాయ్, జూలై 30: భారత్తో టెస్ట్ సిరీస్తో ఇంగ్లాండ్ సరికొత్త మైలురాయిని చేరనుంది. టెస్ట్ క్రికెట్ను అమితంగా ఇష్టపడే ఇంగ్లాండ్, భారత్తో మొదలయ్యే తొలి మ్యాచ్తో వెయ్యో టెస్ట్ రికార్డుకు చేరుతుంది. చారిత్రక మ్యాచ్కు సిద్ధమవుతున్న ఇంగ్లాండ్కు ఐసీసీ అభినందనలు తెలిపింది. 1877 మార్చిలో ఆస్ట్రేలియాతో మెన్స్ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఇంగ్లాండ్ ఇప్పటికి 999 టెస్ట్ మ్యాచ్లు పూర్తి చేసింది.
బర్మింగ్హామ్, జూలై 30: ఐదు టెస్టుల్లోనూ ఇద్దరు సీమర్స్ ఉంటారనుకోవడం కచ్చితమైన అంచనాకాదని ఇంగ్లాండ్ స్పీడ్స్టార్ స్టార్ట్ బ్రాడ్ స్పష్టం చేశాడు. ప్రతి మ్యాచ్లోనూ జేమ్స్, నేనూ ఉంటామని అనుకోవడం లేదు. మాపై భారం తగ్గించేందుకు రొటేషన్ స్ట్రాటజీని యాజమాన్యం అమలు చేస్తుందనే అనుకుంటున్నా అన్నాడు. ‘పిచ్ బాగా టర్న్ అయితే స్పిన్నర్లపై ఎక్కువ భారం పడుతుంది. అప్పుడు మేం ఎక్కువ బంతులు వేయాల్సి రాకపోవచ్చు.
దుబాయ్, జూలై 30: ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్కు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చెక్ పెడతాడా? అంటే అవకాశాలు లేకపోలేదంటున్నారు క్రికెట్ విజ్ఞులు. ఇంగ్లాండ్తో జరగనున్న ఐదు టెస్ట్ల సిరీస్ తరువాత స్మిత్ టాప్ ర్యాంకులో ఉండకపోవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
వ్లాడివొస్టాక్ (రష్యా): భారత షటిల్ బాడ్మింట్ మాజీ చాంపియన్, 25 ఏళ్ల సౌరభ్ వర్మ రష్యా ఓపెన్ టూర్ సూపర్ 100 టోర్నమెంట్ విజేతగా నిలిచాడు. ఆదివారం ఇక్కడి స్పోర్ట్ హాల్ ఒలింపిక్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన ప్రపంచ నెంబర్ 119 ర్యాంకర్ కొకి వతనబెపై 19-21, 21-12, 21-17 తేడాతో పైచేయి సాధించి టైటిల్ను కైవసం చేసుకున్నాడు.