-
హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భ
-
వరంగల్: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసు
-
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండ
-
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్కు వెళ్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణ
కామారెడ్డి, జూలై 7: తన కొడుకే తనకు భారమని భావించాడో ఏమో ఒక తండ్రి కన్నకొడుకును రైల్వేస్టేషన్లో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఈ సంఘటన జగిత్యాల మండలంలోని లింగంపేట్ రైల్వేస్టేషన్లో జరిగగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సిరిసిల్ల, జూలై 7: మానసిక పరిస్థితి సరిగా లేని యువతిని లోబర్చుకుని, చాటుమాటుగా ఆమెతో శారీరకంగా సంబంధం పెట్టుకోవడంతో గర్భం దాల్చిన యువతి బాత్ రూమ్లోనే ప్రసవించిన ఉదంతం వెలుగు చూసింది. ఆదివారం సిరిసిల్ల మండలం చిన్న బోనాల మున్సిపల్ విలీన గ్రామంలో జరిగిన ఈ సంఘటనలో ప్రసవించిన కొద్ది క్షణాలకే ఆడ శిశువు మృతి చెందింది.
హైదరాబాద్, జూలై 6: టీఆర్ఎస్ పార్టీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తిలేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గోల్కొండ కోట మీద పార్టీ జెండాను ఎగరువేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. శనివారం ఇక్కడ శంషాబాద్లో జరిగిన పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్, జూలై 6: రాష్ట్రంలో ‘రైతుబీమా’ పథకం కింద ఇప్పటి వరకు 12,820 మంది రైతుకుటుంబాలకు 641 కోట్ల రూపాయలు చెల్లించామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. సచివాలయంలోని ‘సీ’ బ్లాకు నుండి జిల్లాల్లోని వ్యవసాయ, ఉద్యాన శాఖ సిబ్బందితో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
హైదరాబాద్, జూలై 6: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో సూచించిన సెస్ విధానం తెలంగాణ ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపనుంది. కేంద్రం పెంచిన సెస్ విధానంతో ఏడాదికి రూ. 67 కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుందని ఆర్టీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో ఇక ఆర్టీసీ నడపడం కష్టసాధ్యంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, జూలై 6: ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆత్మహత్యలకు పాల్పడ్డ ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియో చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని అఖిల పక్ష నేతలు ఎద్దేవా చేశారు. తామే బాధిత కుటుంబాలను ఆదుకుంటామని పేర్కొంటూ చార్మినార్ వద్ద అఖిలపక్ష నేతలు భిక్షాటన ప్రారంభించారు. దాంతో పోలీసులు అడ్డుకుని వారిని అరెస్టు చేశారు.
హైదరాబాద్, జూలై 6: ఇంజనీరింగ్ కాలేజీల్లో 2019-22 బ్లాక్ పీరియడ్కు ఫీజులను భారీగా పెంచడం దారుణమని తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు నాగటి నారాయణ, కార్యదర్శి పగడాల లక్ష్మయ్య పేర్కొన్నారు. గతంలో 50వేలు ఫీజు ఉన్న కాలేజీలను లక్ష రూపాయిల లోకి తెచ్చేశారని విమర్శించారు.
హైదరాబాద్, జూలై 6: బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్రహోంమంత్రి అమిత్షా పర్యటన శనివారం బిజీ బిజీగా సాగింది. ఈ పర్యటనలో రానున్న రోజుల్లో బీజేపీని పటిష్టంగా తీర్చిదిద్దడంపై దృష్టినిసారించారు. శనివారం శంషాబాద్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం తర్వాత అమిత్ షా పార్టీ రాష్ట్ర నేతలతో అంతరంగిక సమావేశం నిర్వహించారు.
నేరేడుచర్ల/పాలకీడు, జూలై 6: రాష్ట్రంలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
గోపాల్పేట, జూలై 6: భవిష్యత్లో నీటి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని భూగర్భజలాలను పెంపోందించుకోవడంతో పాటు వాన నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాలి చక్రవర్తి అన్నారు. శనివారం గోపాల్పేట, రేవల్లి మండలాల్లోని పలు గ్రామాలలో ఆమె పర్యటించారు.