S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/05/2016 - 06:46

మంగళగిరి, ఆగస్టు 4: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం పట్టణణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ గాలిగోపురం ఎదుట గల మహాత్మాగాంధీ విగ్రహం వరకు సాగింది. గాంధీకి వినతిపత్రం అందజేశారు.

08/05/2016 - 06:45

తెనాలి రూరల్, ఆగస్టు 4: స్థానిక జయప్రకాష్‌నగర్‌కు చెందిన వేముల లక్ష్మీదుర్గ(30)ను ఆమె భర్త వెంకటకృష్ణ గురువారం సాయంత్రం సమయంలో రోకలి బండతో తలపై మోది హతమార్చాడు. పోలీసుల కథనం ప్రకారం వెంకటకృష్ణ లక్ష్మీదుర్గకు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 7 సంవత్సరాల బాబు, 5 సంవత్సరాల కుమార్తె ఉన్నారు.

08/05/2016 - 06:44

భద్రాచలం, ఆగస్టు 4: మన్యాన్ని ముసురు వీడటం లేదు. గత నాలుగు రోజులుగా ఆకాశానికి చిల్లు పడ్డట్లుగా ఒకటే వాన. కుండపోతతో జనజీవనం అస్తవ్యస్తంగా మారి స్తంభించింది. వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. పాలెం, తాలిపేరు ప్రాజెక్టుల్లోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది.

08/05/2016 - 06:43

ఖానాపురం హవేలి, ఆగస్టు 4: ఖమ్మం సర్వే ల్యాండ్ రికార్డ్సులో పని చేస్తున్న మురళీ అనే సర్వేయర్ ఏసిబికి చిక్కారు. బోనకల్ మండలం కలకోట గ్రామానికి చెందిన కానూరి గోపీకృష్ణ అనే రైతు తన భూమిని రీ సర్వే చేయాలని మండల రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.

08/05/2016 - 06:42

ఖమ్మం, ఆగస్టు 4: అటవీ భూమిలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులపై దాడులు చేస్తున్నారని, పంటను నాశనం చేస్తున్నారని ఆరోపిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. హరితహారం పేరుతో పేదల పొట్టలు కొడుతున్నారంటూ సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసి, సిపిఐ, సిపిఎంలు క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆందోళనలు చేస్తున్నాయి. ఇది గత కొనే్నళ్ళుగా జరుగుతూనే ఉంది.

08/05/2016 - 06:40

నంద్యాల, ఆగస్టు 4: నంద్యాల పట్టణ శివారులో కుందూనది ఒడ్డున రైల్వే శాఖకు చెందిన 22 ఎకరాల రైల్వే స్థలం కబ్జాదారుల చేతిలో ఆక్రమణకు గురైనా రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదు. రైల్వే స్థలంలో బడా బాబులు తిష్టవేసి దర్జాగా వరి సాగు చేసుకుంటున్నారు.

08/05/2016 - 06:37

విశాఖపట్నం, ఆగస్టు 4: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 9వ తేదీన జిల్లాలోని అరకు, పెదలబుడు గ్రామాల్లో పర్యటించనున్నట్టు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. ఇప్పటివరకు ఖరారైన తాత్కాలిక పర్యటన కార్యక్రమం ప్రకారం ముఖ్యమంత్రి తాను దత్తత తీసుకున్న గిరిజన గ్రామం పెదలబుడు సందర్శించే అవకాశం ఉందని, అరకులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకుల్లో పాల్గొంటారన్నారు.

08/05/2016 - 06:37

జగదాంబ, ఆగస్టు 4: ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని స్మార్ట్ క్యాంపస్‌గా తీర్చిదిద్దుతున్నామని ఎయు ఉప కులపతి ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. గురువారం సాయంత్రం ఎయు వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించిన ‘యుఎస్ డెలిగేషన్ ఆన్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఐటి ట్రెండ్స్’ సదస్సును ఆయన ప్రారంభించారు.

08/05/2016 - 06:36

విజయవాడ : విశాఖ నగర మాజీ డిప్యూటీ మేయర్ దొరబాబు గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. దొరబాబు చాలా కాలంపాటు కాంగ్రెస్‌లో పని చేశారు. గత జివిఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. మేయర్ పదవిని ఆశించిన దొరబాబు అందుకు పూర్తిగా రంగం సిద్ధం చేసుకున్నారు. చివరి నిముషంలో మేయర్ పదవిని బిసికి ఇవ్వాలని నిర్ణయించడంతో ఆ పదవి పులుసు జనార్దనరావుకు దక్కింది.

08/05/2016 - 06:36

జగదాంబ, ఆగస్టు 4: ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రత్యక్ష పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే దిశగా కృషి చేయాలని ఎయు ఉపకులపతి ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఎయు వృక్షశాస్త్ర విభాగంలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

Pages