కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను హతమార్చిన భర్త
Published Friday, 5 August 2016తెనాలి రూరల్, ఆగస్టు 4: స్థానిక జయప్రకాష్నగర్కు చెందిన వేముల లక్ష్మీదుర్గ(30)ను ఆమె భర్త వెంకటకృష్ణ గురువారం సాయంత్రం సమయంలో రోకలి బండతో తలపై మోది హతమార్చాడు. పోలీసుల కథనం ప్రకారం వెంకటకృష్ణ లక్ష్మీదుర్గకు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 7 సంవత్సరాల బాబు, 5 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో సాయంత్ర సమయంలో భార్యను హతమార్చిన వెంకటకృష్ణ పిల్లలను అక్కడే వదలి పరారయ్యాడు. సమాచారం అందుకున్న టూ టౌన్ ఎస్ఐ భాస్కరరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం తెనాలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.