S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/11/2018 - 03:51

విజయవాడ, ఏప్రిల్ 10: దేశంలో మూడుకోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్‌ల మంజూరుకై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉజ్వల’ పథకానికి ఆంధ్రప్రదేశ్‌లో మరింత విస్తృత ప్రచారం చేసేందుకు గ్యాస్ కంపెనీలు నడుం కట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 20తేదీ సాయంత్రం ప్రతి గ్యాస్ డీలర్ తన పరిధిలో కనీసం 500 మంది ప్రజలకు తగ్గకుండా భారీ ఎత్తున సభలు నిర్వహించాలని కంపెనీలు నిర్ణయించాయి.

04/11/2018 - 03:50

విజయవాడ, ఏప్రిల్ 10: ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికై రమేష్ హాస్పటల్స్ తమ వంతు సాయంగా 10 లక్షల రూపాయలను విరాళంగా అందచేసింది. హాస్పిటల్ చైర్మన్ మద్దిపాటి సీతారామ్మోహనరావు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్‌బాబు మంగళవారం సీఎం చంద్రబాబును సచివాలయంలో కల్సి చెక్కు అందచేయగా ఆయన వీరిరువురిని అభినందించారు.

04/11/2018 - 03:49

విజయవాడ, ఏప్రిల్ 10: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) ఆంధ్రప్రదేశ్ శాఖకు రెండోసారి కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే కె.రామకృష్ణకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాష్ట్ర కార్యవర్గానికి ఎన్నికైన ఇతర సభ్యులకు శుభాభినందనలు తెలిపారు.

04/11/2018 - 03:49

గుంటూరు, ఏప్రిల్ 10: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తమవంతు సహకారాన్ని అందిస్తామని అభివృద్ధి నమూనాలో అనుభవాలను పంచు కుంటామని దేశ, విదేశీ ప్రతినిధులు వెల్లడించారు. మంగళగిరి సీవీ కనె్వన్షన్‌లో సీఆర్డీయే, సీఐఐ సంయుక్త ఆధ్వర్యంలో మూడురోజుల పాటు నిర్వహించే సంతోష నగరాల సదస్సును మంగళవారం ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ జ్యోతిప్రజ్వలనచేసి ప్రారంభించారు.

04/11/2018 - 03:48

గుంటూరు, ఏప్రిల్ 10: ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరైన సంతోష నగరాల సదస్సులో భూటాన్‌లోని జెలెఫర్ నగర మాజీ మేయర్ తికారాం కెఫ్లీ ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రధానమంత్రిగా సంభోదించటంతో సదస్సుకు హాజరైన ప్రతినిధులు విస్తు పోయారు. స్మార్ట్‌నగరాల నిర్మాణంపై తన అనుభవాలను వివరించిన కెఫ్లీ ‘ప్రైమ్ మినిస్టర్’ చంద్రబాబునాయుడు ఓ విజన్ ఉన్న నాయకుడని అభివర్ణించారు.

04/11/2018 - 03:48

విజయవాడ, ఏప్రిల్ 10: పార్లమెంటు సమావేశాలను జరగనీయకుండా అడ్డుకున్నందుకు నిరసనగా ఈనెల 12న ప్రదర్శనలు, దీక్షలు చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర అభివృద్ధి కమిటీ కన్వీనర్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు పేర్కొన్నారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల రోజులుగా పార్లమెంటును జరగనీయకుండా అడ్డుకున్న ప్రతిపక్షాల తీరు ఆక్షేపణీయమన్నారు.

04/11/2018 - 03:47

విజయవాడ, ఏప్రిల్ 10: ఉపాధి హామీ పథకం అమల్లో దేశంలో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరంలో 6149 కోట్ల రూపాయల మేర ఈ పథకం కింద పనులు చేపట్టారు. మొదటి రెండు స్థానాలను పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఆక్రమించాయి. 21.53 కోట్ల పనిదినాలు కల్పించి ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది.

04/11/2018 - 03:46

విజయవాడ, ఏప్రిల్ 10: ప్రధానిగా మోదీ ఉన్నంత వరకూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని ఎంపీ జెసి దివాకర రెడ్డి వ్యాఖ్యానించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ హోదా కోసం ఢిల్లీలో పోరాటం చేసిన ఎంపీలు, సీఎం పిలుపు మేరకు ఏపీకి తిరిగి వచ్చారన్నారు. రాష్ట్రంలో ఎంపీలతో బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించారని, రూట్ మ్యాప్‌పై చర్చించేందుకు తమను రావాలని ఆదేశించారన్నారు.

04/11/2018 - 03:46

విజయవాడ, ఏప్రిల్ 10: అణగారిన, అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమానికి, అభ్యున్నతికి తన జీవితాన్ని వెచ్చించిన మహాత్ముడు జ్యోతిరావు ఫూలే అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. మహాత్మా జ్యోతీరావుపూలే జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకున్నారు. పూల వ్యాపారం చేసి మానవతా పరిమళాలు వెదజల్లారని అన్నారు. ముళ్లబాటలో తాను నడిచి అట్టడుగు వర్గాలు పూలబాటలో నడిచేందుకు జీవితానే్న వెచ్చించారని కొనియాడారు.

04/10/2018 - 04:34

విజయవాడ, ఏప్రిల్ 9: వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై నిరంతర నిఘా అవసరమని, ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. మొత్తం 10 కెమెరాలతో పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్నామని అధికారులు వివరించగా, పనుల పర్యవేక్షణతో పాటు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

Pages