S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/14/2018 - 02:09

విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్రంలోని మామిడి పండించే రైతులకు అధిక దిగుబడులు సాధించడంతో పాటు లాభదాయకమైన ధరలు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ఉద్యానవన, మల్బరీ శాఖ కమిషనర్, ప్రభుత్వ ఎక్స్‌అఫిషియో సెక్రటరీ చిరంజీవి చౌదరి తెలిపారు. నగరంలో శుక్రవారం తొలిసారిగా రాష్టస్థ్రాయి మామిడి కొనుగోలు, విక్రయదారుల సమావేశం నిర్వహించారు.

04/14/2018 - 02:08

విజయవాడ, ఏప్రిల్ 13: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో వేతన చెల్లింపుల కోసం రూ. 1602.27 కోట్ల నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకులు పి రంజిత్ బాషా శుక్రవారం ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. ఇందులో గత ఏడాదికి సంబంధించిన వేతన బకాయిల మొత్తాలు కూడా కలిసి ఉన్నాయన్నారు. ఈ మొత్తంలో ఇప్పటికే రూ.

04/14/2018 - 02:08

విజయవాడ, ఏప్రిల్ 13: జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, ఈ విషయాన్ని గతంలో తాను ఎన్నోసార్లు చెప్పానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. తనకు అలాంటి ఆకాంక్షలు లేవని వ్యాఖ్యానించారు. సింగపూర్‌లో శుక్రవారం జరిగిన హెచ్‌టీ మింట్ ఆసియా లీడర్‌షిప్ సమ్మిట్‌లో సభికులు అడిగిన ఓ ప్రశ్నపై ఆయన స్పందించారు.

04/13/2018 - 05:09

సూళ్లూరుపేట, ఏప్రిల్ 12: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ట మరో సారి ఇనుమడించింది. ఇస్రో నమ్మిన బంటు పీఎస్‌ఎల్‌వీల రాకెట్ల విజయ పరంపరలు షార్‌లో కొనసాగుతున్నాయి. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్తవ్రేత్తల ఉత్సాహం ఉరకలేయడంతో పాటు విజయగర్వం తొణికిసలాడుతోంది.

04/14/2018 - 04:52

గుంటూరు, ఏప్రిల్ 13: పేద.. ధనిక..వర్గ.. తారతమ్యాలు లేకుండా చెరగని చిరునవ్వే భారతీయులకు తరతరాలుగా సంక్రమించిన వారసత్వమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. సీఆర్డీయే, సీఐఐ సంయుక్త ఆధ్వర్యంలో మంగళగిరి సీవీ కనె్వన్షన్‌లో నిర్వహిస్తున్న మూడు రోజుల హ్యాపీసిటీస్ సమ్మిట్-2018 గురువారం సాయంత్రం ముగిసింది.

04/13/2018 - 05:03

భీమడోలు, ఏప్రిల్ 12: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని రాష్టవ్య్రాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు గురువారం కొరడాలతో స్వయంగా కొట్టుకుంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తొలుత ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే వీరాంజనేయులు భీమడోలు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు.

04/13/2018 - 04:52

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 12: ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు పరీక్షలు ముగిసిన 24 రోజుల్లోనే వెల్లడించామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని ఓ హోటల్‌లో గురువారం మధ్యాహ్నం మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదలచేశారు.

04/13/2018 - 02:32

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 12: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి, టాప్ టెన్‌లో నిలిచిన వారిలో ఎక్కువ శాతం బాలికలే ఉన్నారు. ఎంపీసీలో 992 మార్కులతో కున్నం తేజ వర్ధనరెడ్డి ప్రథమ స్థానంలో నిలవగా , 991 మార్కులతో ఆఫ్రిన్ షేక్, 990 మార్కులతో వాయిలపల్లి సుష్మ ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచారు.

04/13/2018 - 02:32

సూళ్లూరుపేట, ఏఫ్రిల్ 12: దేశీయ నావిగేషన్ దిక్సూచి వ్యవస్థ సేవల కోసం త్వరలో యాప్‌ను విడుదల చేయనున్నట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ చెప్పారు. గురువారం పీఎస్‌ఎల్‌వీ-సీ 41 రాకెట్ ప్రయోగ విజయనంతరం ఆయన శాస్తవ్రేత్తలతో కలసి మీడియా సెంటర్‌లో విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శివన్ ఈ ఏడాది మిగతా 8నెలల్లో మరో 9ప్రయోగాలు షార్ కేంద్రం నుంచి చేపట్టనున్నట్లు వెల్లడించారు.

04/13/2018 - 02:31

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 12: ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అత్యధిక శాతం ఏ గ్రేడులో ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫలితాల్లో ఈ ఏడాది నుండి తొలిసారిగా గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టారు. ఏ, బీ, సీ, డీ అనే నాలుగు గ్రేడుల విధానాన్ని ప్రవేశపెట్టారు.

Pages