-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
తిరుపతి: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ వైష్ణవ ఆలయాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ ప్రారంభమైంది. ఎ.పి.లోని తిరుమల, ఒంటిమిట్ట, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, తెలంగాణలో యాదాద్రి, భద్రచలం, వేములవాడ తదితర ఆలయాల్లో భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు. తిరుమలలో స్వామివారు ఈ రోజు ఉదయం స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
విశాఖ: జి.మాడుగుల మండలం మడవకొండ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి మావోయిస్టులు ప్రజా కోర్టును నిర్వహించి, ఇన్ఫార్మర్గా పని చేస్తున్నాడన్న అభియోగంపై ఓ వ్యక్తిని కాల్చి చంపారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే సోమవారం ఉదయం పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు.
హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ను ఎత్తివేయక పోవడం, కాల్మనీ వ్యవహారంపై చర్చ చేపట్టక పోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ వైకాపా ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా శీతాకాల సమావేశాలకు తాము హాజరయ్యే ప్రసక్తి లేదని విపక్ష నాయకులు వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశంలో ప్రకటించారు.
తిరుమల: తిరుమల మొదటి కనుమ రహదారిలోని 35వ మలుపు వద్ద శనివారం వ్యాన్ లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఆ విషయాన్ని గమనించిన భక్తులు వాహనంలో నుంచి కిందకి దూకేశారు. పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ను మెడికల్ హబ్గా తయారు చేయాలనేదే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్ శంకస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... వైద్య సేవలకు అమరావతి కేంద్రంగా తయారుకాబోతుందన్నారు.
ఎర్రగొండపాలెం: ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం మండలం నిక్కంటి దగ్గర నల్లమల అటవీ ప్రాంతంలో మావోయిస్టుల డంప్ను పోలీసులు శుక్రవారం గుర్తించారు. ఈ డంప్లో భారీగా లాంచర్లు, గన్లు, బుల్లెట్లు లభ్యమైనట్లు తెలుస్తుంది.
తర్లుపాడు, డిసెంబర్ 17 : ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన తర్లుపాడులో ఆయుర్వేద మందుల పేరుతో తయారు చేస్తున్న నకిలీ మందులను ఔషధ నియంత్రణ అధికారి షేక్ ఆబిద్అలీ బుధవారం రాత్రి దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. 10 లక్షల రూపాయల విలువైన నకిలీ ఔషధాలను, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు, డిసెంబర్ 17: కళాశాల ఆవరణలో విద్యార్థినిపై ఓ యువకుడు సుత్తితో తలపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన నగరంలో తీవ్ర సంచలనం కలిగించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుంటూరు కొత్తపేట సిఐ వెంకన్నచౌదరి మాట్లాడుతూ కళాశాల ప్రాంగణంలో గల సిసి కెమేరాల పుటేజీల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు.
కడప, డిసెంబర్ 17: రాష్ట్రంలో కాల్మనీ వ్యవహారం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో కడప జిల్లాలో వడ్డీ వ్యాపారి వేధింపులు తట్టుకోలేక గురువారం ఓ మహిళ ఆత్మహత్యకు అసువులు బాసింది. బాధితులు పలువురు పోలీసులకు ఫిర్యాదులు చేసేందుకు సైతం సాహసించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.