చిత్తూరు

శ్రీవారి పాదాలకు వెళ్లే రోడ్డు మార్గంలో ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, ఏప్రిల్ 11: తిరుమలలోని శ్రీవారి పాదాలకు వెళ్లే రోడ్డు మార్గంలో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. శ్రీవారి పాదాల నుంచి వేగంగా వస్తున్న ఓ ఇండికా వాహనం ఎదురుగా వస్తున్న సుమోను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇండికా వాహనంలో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన భాటియా (37) అనే భక్తుడి తలకు బలమైన గాయం కాగా అతడి కుమార్తెకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదం సమాచారం తెలుసుకున్న టిటిడి విజిలెన్స్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్ సహాయంతో స్థానిక అశ్వని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కొరకు క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అశ్వని ఆసుపత్రి వైద్యులు గాయపడిన వారికి ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు.

కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
* ఇద్దరు మృతి
చంద్రగిరి, ఏప్రిల్ 11: చంద్రగిరి సమీపంలో పాకాలవారిపల్లె వద్ద ఎదురుగా వస్తున్న మినీవ్యాన్‌ను ఓ బస్సు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.