చిత్తూరు

ప్రోటోకాల్ ప్రముఖులకు నిబంధనల ప్రకారం శ్రీవారి దర్శనం, వసతి కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 16: తిరుమలకు వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు నిబంధనల ప్రకారం శ్రీవారి దర్శనం, వసతి కల్పించాలని, ఆయా విభాగాల అధికారులు ఈ విషయంలో పూర్తి సమన్వయంతో పనిచేయాలని టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ రాజ్యాంగపరమైన కార్యనిర్వాహక, శాసన, న్యాయ విభాగాలకు చెందిన ముఖ్యమైన ప్రముఖులు తిరుమలకు వచ్చినపుడు చేపట్టాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ప్రోటోకాల్ ప్రముఖులకు నిర్దేశించిన విధివిధానాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. దర్శన టిక్కెట్ల కొనుగోలు, ఆలయ మర్యాదలు విషయంలో నిబంధనలను అనుసరించాలని సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ డిప్యూటీ ఈఓలు హరీంద్రనాధ్, బాలాజీ, వెంకటయ్య, దామోదరం, వరలక్ష్మి, సీఏఓ రవిప్రసాద్, ఓఎస్‌డీ లక్ష్మీనారాయణ యాదవ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.