చిత్తూరు

పమలనేరులో పార్టీని బలోపేతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలమనేరు, జూన్ 16: నియోజకవర్గంలో టీడీపీని మరింత బలోపేతం చేయాలని మంత్రి అమరనాధరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పలమనేరులోని పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేడు తెలుగు దేశం ప్రభుత్వం చేపట్టుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెల్లాలన్నారు. నేడు అన్ని వర్గాల వారికి ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెట్టిందని అయితే ఈ విషయాలు గ్రామాల్లోని ప్రజలకు తెలియడం లేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారి అందేలా చూడాలన్నారు. ఓటర్లు నమోదులో కూడా కీలక పాత్ర పోషించాలని తెలిపారు. నియోజక వర్గంలో గ్రామాల వారిగా పార్టీ స్థితి గతులను ఎప్పటి కప్పుడు సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. నవనిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు పలువురు పార్టీ నేతలు కార్యకర్తలను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఆర్టీసీ చైర్మన్ సుభాష్ చంద్రబోస్, టీడీపీ జిల్లా కోశాధికారి బాలాజీ, మార్కెట్ కమిటీ అధ్యక్షలు హెమంత్ కుమార్ రెడ్డి పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.