చిత్తూరు

తిరుమలలో రథ సప్తమి నాటి వాహన సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 22: సూర్య జయంతిని పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమినాడు ఫిబ్రవరి 12వ తేదీన ఉదయం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప స్వామివారు చతుర్మాడ వీధుల్లో విహరించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 5.30 నుంచి 8గంటల వరకు సూర్యప్రభ వాహనంపైన, 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపైన భక్తులకు దర్శనమిస్తారు. 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపైన, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై చతుర్మాడ వీధుల్లో ఊరేగుతారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు పుష్కరణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ, 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ, రాత్రి 8 నుంచి 9గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ జరుగుతుంది.