చిత్తూరు
రేణిగుంటలో తొమ్మిదేళ్ల బాలిక అదృశ్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 14 May 2016
రేణిగుంట, మే 13: పట్టణంలో బాలిక అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించింది. బాలిక తల్లి తులసి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం, తిరుత్తణికి చెందిన తులసి, సురేష్ల ఏకైక కుమార్తె మోహనప్రియ(9) నాల్గవ తరగతి చదువుతోంది. పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో రేణిగుంటలోని తన తాత దామోదరం ఇంటికి తన తల్లితో కలసి వచ్చింది. గత ఆదివారం రాత్రి బజారుకు తన తాతతో కలసి వెళ్ళింది. అయితే తనతోపాటు వచ్చిన మోహనప్రియ కనపించకపోవడంతో ఆమె కోసం గాలించారు. వారం రోజులపాటు వెదికినా ఆమె ఆచూకీ తెలియక పోవడంతో శుక్రవారం రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసునమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.