చిత్తూరు

ముగ్గురు దోపిడీ దొంగలు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 27: స్థానిక వైకుంఠపురంలో ఈనెల 5వ తేదీన రిటైర్డ్ టిటిడి ఇ ఇ ప్రభాకర్‌పై దాడిచేసి విలువైన బంగారు ఆభరణాలు, రెండు సెల్‌ఫోన్లను దొంగిలించిన ముగ్గురు దోపిడీ దొంగలను తిరుపతి క్రైం పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. తిరుపతి క్రైం ఏఎస్పీ సుబ్బారెడ్డి అదేశాల మేరకు డిఎస్పీ కొండారెడ్డి ఆధ్వర్యంలో నిందితులను ఎమ్మార్‌పల్లి వద్ద ఉన్న ఉప్పరపల్లి క్రాస్ వద్ద నిందితులను అరెస్టుచేశారు. అనంతపురం జిల్లా కల్యానదుర్గంకు చెందిన ఎస్.రామదాసు(24), తిరుపతి రంగంపేట వద్ద ఉన్న రాంరెడ్డిపల్లికి చెందిన టి.బాలాజీ(25), విజయనగరం జిల్లా పార్వతీపురంకు చెందిన ఎం.శ్రీనివాసరావు అలియాస్ శీను(25) ప్రభాకరమూర్తిపై కత్తితో దాడిచేసి ముఖంపైన, శరీరంపైన గాట్లు చేసి దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి 115 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు సెల్‌ఫోన్లు, 3కత్తులు, విజయవాడలో పరిసర ప్రాంతాల్లో చోరీ చేసిన రెండు హోండాయాక్టివ్ మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి, చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న క్రైం సి ఐ, ఎస్ ఐ ఇతర సిబ్బందిని ఏ ఎస్సీ అభినందించారు.