చిత్తూరు

2 లక్షల విలువచేసే గుట్కాలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రాపురం, మే 30 : మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా 2 లక్షల విలువచేసే గుట్కాలను తరలిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ సురేష్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు నుంచి తిరుపతికి కారులో తీసుకొస్తున్న గుట్కాలు, హాన్స్ ప్యాకెట్లు ఉన్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా గుట్కా, హాన్స్ ప్యాకెట్లు ఉండటంతో వాహనంతో సహా వాటిని స్వాధీనం చేసుకుని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులురెడ్డికి సమాచారం అందించి వాటిని అందించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ సుబ్బయ్య, హెడ్‌కానిస్టేబుల్ శేఖర్‌రాజు, శోభనాద్రి, కిశోర్‌బాబు, కానిస్టేబుళ్లు ఉదయ్, మహేంద్ర, రామానాయుడు, గిరి, మాధవి పాల్గొన్నారు.