చిత్తూరు

తిరుపతిలో టిడిపి మహానాడు నభూతో నభవిష్యత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 30 : తిరుపతిలో మూడు రోజులపాటు జరిగిన మహానాడు సభలు నభూతో నభవిష్యత్ అన్న చందంగా ఘనంగా నిర్వహించడం జరిగిందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మూడు రోజుల మహానాడు సంబరాలు పండుగ వాతావరణంలో జరిగాయన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇది తమ ఇంటి కార్యక్రమంగా భావించి పనిచేశారని అన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా అందరు కలసికట్టుగా పనిచేయడంతో అనుకున్న దానికన్నా ఎక్కువగా విజయవంతమైందని తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే తలారి ఆదిత్య, ఎన్‌టిఆర్ టిడిపి వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సూరా సుధాకర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ నరసింహయాదవ్, మహిళ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, తెలుగుయువత జిల్లా అధ్యక్షులు శ్రీ్ధర్‌వర్మ, నాయకులు మందలపు మోహన్‌రావు, పుష్పావతి యాదవ్ పాల్గొన్నారు.