కడప

2వ రోజుకు చేరిన ఉక్కుదీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 21: ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకై ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్‌నాయుడు, ఎమ్మెల్సీ బీటెక్ రవీలకు 2వ రోజుకూడా భారీఎత్తున జనాదరణ లభించింది. ఉద్యమం చేపట్టి గురువారానికి రెండవ రోజు కావడంతో వివిధ వర్గాలు భారీగా తరలివచ్చాయి. నగరంలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు వందల సంఖ్యలో తరలివచ్చి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వారికి తెలిపారు. బ్రాహ్మణసంఘం, న్యాయవాదుల సంఘం, ఉద్యోగ సంఘాలు, యువజన సంఘాలు తమ మద్దతు ప్రకటించాయి. కాగా ఈసమావేశానికి గనులశాఖ మంత్రి సుజయ్ కృష్ణారంగారావు, జిల్లాకు చెందిన మంత్రి సి.ఆదినారాయణరెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్, కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎం.లింగారెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి, డీసీసీ బ్యాంకు చైర్మన్ అనిల్‌కుమార్‌రెడ్డి, పార్టీ జిల్లా అద్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి, జిల్లాకార్యదర్శి బి.హరిప్రసాద్, పార్టీ రాష్టక్రార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, నగర అధ్యక్షుడు జిలానీబాషా, మాజీ అధ్యక్షుడు బాలకృష్ణయాదవ్, డాక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సోహెల్, బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సాయినాధశర్మ, జిల్లా డైరెక్టర్ జనార్ధన్ తదితరులు ఈసమావేశంలో పాల్గొన్నారు.