కడప

వైసీపీ నవరత్నాలతో ప్రజలందరికి సంక్షేమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓబులవారిపల్లె, సెప్టెంబర్ 21:రాష్ట్రంలో త్వరలో రాజన్న రాజ్య పాలన రాబోతుందని, వైసీపీ అధినేత జగనన్న ప్రకటించిన నవరత్నాలతో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మాజీ ఎంపి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం రావాలి జగన్.. కావాలి జగన్ అంటూ గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీలకు చెందిన 20 కుటుంబాలు వైసీపీలో చేరగా పార్టీ కండువాలతో ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన ఏ ఒక్క హమీని అధికారంలోకి వచ్చాక నెర వేర్చలేదన్నారు. రాజధాని పేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడుతుందన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీని ఎండగట్టేలా జగనన్న చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష స్పందన ఏదీ ఏమైనప్పటికి వచ్చే ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ముస్లీంలు పార్టీలో చేరడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సయ్యద్ జమీర్, అక్భర్‌బాషా, మస్తాన్‌వలీ, ఖాసీం, వౌలాబాషా, పటేల్‌సాహెబ్‌తో పాటు పలువురు వైసీపీలో చేరారు.

.