కడప

రేపు టిటిడి ఇఓ, చైర్మన్ల రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, జూలై 25:ఒంటిమిట్ట కోదండ రామాలయానికి బుధవారం టిటిడి ఇఓ సాంబశివరావు, చైర్మన్ చదవలవాడ కృష్ణమూర్తి విచ్చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రూ. 4 కోట్లతో నిర్మిస్తున్న అభివృద్ధి పనుల శంకుస్థానన కార్యక్రమాలలో వీరు పాల్గొననున్నారు. కల్యాణ మంటపం, 20 అదనపు గదులు, భక్తులకు ఆడిటోరియం వంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరగనున్నాయి.
రామయ్యను దర్శించుకున్న
ఎస్పీ రామకృష్ణ
ఒంటిమిట్ట, జూలై 25:మరో అయోధ్యగా పేరుగాంచి, ఏకశిలానగరంగా విరాజిల్లుతున్న కోదండ రాముని దర్శనార్ధం జిల్లా ఎస్పీ రామకృష్ణ సోమవారం కుటుంబ సమేతంగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక పోలీసులు, టిటిడి అధికారులు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ స్వామివారి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరగా అర్చకులు ఎస్పీని దుశ్శాలువతో సత్కరించి ఆలయ చరిత్రను విశదీకరించి తీర్థప్రసాదాలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట సిఐ శ్రీరాములు, ఎస్సై రెడ్డిసురేష్, సిబ్బంది పాల్గొన్నారు.