కడప

ప్రొద్దుటూరులో గొలుసు చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు రూరల్, జూలై 31: పట్టణంలో చైన్‌స్నాచర్స్ రోజురోజుకూ పెట్రేగిపోతున్నారు. శనివారం సాయంత్రం వన్‌టౌన్ పరిధిలోని వరలక్ష్మీ అపార్ట్‌మెంట్ వద్ద ఓ మహిళ మెడలోని గొలుసును దొంగిలించిన విషయం మరువక ముందే ఆదివారం ఉదయం మరో గొలుసు దుండగులు లాక్కెళ్లారు. వివరాలలోకి వెళితే టుటౌన్ పోలీసు స్టేషన్ పరిదిలోని గోకుల్‌నగర్ వద్ద సుబ్బలక్ష్మి అను మహిళ మెడలో నుంచి దుండగులు బంగారు గొలుసును లాక్కెళ్లారు. కొర్రపాడురోడ్డులోని పాల్‌టెక్నికల్ కళాశాల ఎదుట చిల్లర దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న సుబ్లక్ష్మి ఆదివారం ఉదయం 6గంటలకు తన దుకాణం నుంచి ఇంటికి వెళ్తోంది. ఈ తరుణంలో గోకుల్‌నగర్ వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి మోటర్‌సైకిల్‌పై వచ్చి మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లాడు. గొలుసు దాదాపు 30 గ్రాములని, సుమారు రూ.60 వేల విలువ చేస్తుందని బాధితురాలు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు టుటౌన్ పోలీసులు కేసు నమోదుచేసి విచారిస్తున్నారు. అర్బన్ సి ఐ సంఘటనా స్థలానికి వెళ్లి ఆరాతీశారు. పట్టణంలో రోజురోజుకూ గొలుసు దొంగతనాలు పెరిగిపోవడం పట్ల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పోలీసులు మరింత నిఘా పెంచి ఈ దొంగతనాలను అరికట్టాలని బాధితులు కోరుతున్నారు.