Others

పరమ పవిత్రం.. వైకుంఠ ఏకాదశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతమైన కాలం భగవత్ స్వరూపం. ప్రాచీనులు కాలాన్ని నాలుగు ప్రమాణాలతో సూచించారు. మాస చతుర్థా...44సావన: సౌర చాంద్రో నాక్షత్ర ఇతి22 అని నిర్ణయ సింధులో పేర్కొబడింది. సావనము, సౌరము, చాంద్రము, నక్షత్రము ద్వారా గణించడం పరిపాటి. చైత్ర వైశాఖ మాసములు, ప్రతిపద విదియాది తిథులు చాంద్రమానం ప్రకారం లెక్కిస్తారు. చాంద్రమానం ప్రకారం పౌర్ణమి నాడు చంద్రుడున్న నక్షత్రాన్ని బట్టి మాస నిర్ణయం చేయగా, సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించి ఉండే నెల రోజులు సౌరమానం ప్రకారం మాసంగా గణిస్తారు. సౌరమాన మాసాలు ఆయా ఇంగ్లీషు తేదీలను పోలి, అధికంగా ఆయా తేదీలలోనే వస్తాయి. అందుకే తమిళులకు ఏప్రిల్ 14ననే మేషారంభమై సంవత్సరాది వస్తుంది. నాగర ఖండ ఆధారంగా 34రవే: సంక్రమణం రాశౌ సంక్రాంతి రిథి కథ్యతే.
ఒక్కొక్క మాసము ఒకొక్క సంక్రాంతిగా చెప్పబడుతుంది. మకర సంక్రాంతి జనవరి 14నుండి కర్కాటక సంక్రాంతి జూలై 16వరకు ఉత్తరాయణం, తదాది మరల మకర సంక్రాంతి వరకు దక్షిణాయనంగా చెప్పబడింది. సౌరకాలమానం ప్రకారం ధనుస్సంక్రమణమైన మాసం దేవతలకు ఉషఃకాలం.4బ్రాహ్మీ ముహూర్తే బుద్ధేత ధర్మార్థౌ చాను చింతయేత్2అని స్మృతి చెపుతున్నది. దేవతలకు ధనుర్మాసం బ్రాహ్మీ ముహూర్త కాలం. మహా విష్ణువు ఆషాఢం మొదలుకుని, కార్తీకం వరకు నిద్రించి, సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించాక, విష్ణు సంబంధ శ్లోకాలచే మేల్కొలిపి అరుణోదయంలో ఉషఃకాల షోడశోపచార పూజలు చేసి, పులగం - పొంగలి - శర్కర నివేదించాలి. నిర్ణయ సింధు కారుని ప్రకారం ఉదయానికి పూర్వం నాలుగు ఘడియలు, ఘడియ అనగా ఇరువై నాలుగు నిమిషాలు - గంటన్నరపై ఆరు నిమిషాలకు పూర్వము అరుణోదయం అగును.
ధనుర్మాసము సౌరమానము యొక్క ప్రామాణికానుసారము కాగా, శుక్ల ఏకాదశి చాంద్రమానమైన తిథి. ప్రతి మాసమునందలి ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. 34గృహస్థో బ్రహ్మచారీ చ ఆహితాగ్నిస్థ థైవచః ఏకాదశ్యాంశ భుంజిత పక్షయోరు భయోరపి22 అని అగ్ని పురాణాదులు వివరిస్తున్నాయి. గృహస్తులకు, బ్రహ్మచారులకు, నిత్యాగ్ని హోత్రులకు నైమిత్తిక కర్మగా ఉపవాసాద్యాచరణము విధించబడినది. ఇట్టి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన దివసము కావునే ఏకాదశి 34హరి వాసరము22గా కొనియాడబడుచున్నది. అందు సౌరమానము నందలి ప్రశస్తమైన ధనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి (మార్గశీర్షము లేక పుష్య మాసం) 34వైకుంఠ ఏకాదశి2గా పిలువ బడుచున్నది. సూర్య చంద్రులు నేత్రములుగా కలిగిన వైకుంఠ వాసునికి సౌర, చాంద్రమానాలలో ప్రశస్తమైన ధనుర్మా శుక్ల పక్ష ఏకాదశి అత్యంత ప్రీతికరమైనది. 34్ధనూరాశి స్థితే సూర్యే శుక్ల ఏకాదశి తిథౌ; త్రింషత్ కోటి సురెః సాకం బ్రహ్మ వైకుంఠ మాగతః పాలస్త్యేనని పీడితాః సురగణాః వైకుంఠలోకం యయుః; ద్వారే తత్ర విషాదభావ మనసా సూకె్తైర్ హరిం తుష్టువుః శుక్లైః శ్రీః హరి వాసరే ప్రభాత సమయే భానౌ ధనుః సంస్థితే, తేభ్యోదాత్ సుఖ దర్శనం కరుణయా నారాయణో మాధవః2 రావణుని బాధలను తాళలేని దేవతలు బ్రహ్మను ఆశ్రయింపగా...ఆ దేవుడు ధనుర్మాస శుక్ల ఏకాదశి దినమున దేవతలందరితో వైకుంఠమునుచేరి, హరి వాసరమునందు దేవతలు విషాద భావ మనస్కులై శ్రీహరిని వేదోక్తంగా స్తుతించగా, వారికి శ్రీహరి సుఖ దర్శనమును కలుగజేసెనని వివరించబడినది. శ్రీప్రశ్న సంహిత(5అ)నందు గల ఐతిహ్యము ననుసరించి మధు కైటభులను భగవానుడు సంహరించినపుడు వారు దివ్యరూపధారులై దివ్య జ్ఞానము పొందగా, బ్రహ్మాదులెవరైనను నీలోకము వంటి మందిరమును నిర్మించి, ఏకాదశి దినోత్సవమును గావించి, నిన్ను నమస్కరించి ఉత్తర ద్వార మార్గమున సమీపింతురో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగునట్లు దీనిని 34మోక్షోత్సవ దినము2గా వరమిచ్చినట్లు తెలియుచున్నది. ముక్కోటి దేవతల బాధలను నివారించినందున 3ముక్కోటి ఏకాదశి2గాను, వైకుంఠ దర్శనము కలిగించునది కనుక 3వైకుంఠ ఏకాదశి2గాను, భగవద్దర్శనము చేయు పవిత్ర దినమైనందున 3్భగవదవలోక దివసముగా కొనియాడ బడుచున్నది. ధనుర్మాస ఏకాదశి కొన్నిసార్లు మార్గశిర మాసమందు, మరికొన్ని మారులు పుష్యమాసమందు రావడం చేత రెండు మాసాల శుక్ల ఏకాదశులు ప్రశస్తములైనవే. మార్గశిరమాస ఏకాదశిని మోక్షైకాదశిఅని, పుష్యమాస ఏకాదశినిపుత్రదైకాదశి, రైవత మన్వాది దినమని పిలుస్తారు. శుక్ల ఏకాదశి నాడు సూర్యుని నుండి వెలువడిన పదకొండవకళ చంద్రుని చేరుతుండగా, బహుళ ఏకాదశి నాడు చంద్రుని నుండి పదకొండవ కళ సూర్య మండలాన్ని చేరుతుంది.
కృతయుగంలో చంద్రవతీ నగరాన్ని ఏలిన మురుడనే రాక్షస సంహార సమయాన, విష్ణు దేహంనుండి ఉత్పన్నమైన స్ర్తిమూర్తియే ఏకాదశి కనుక ఏకాదశికి అధిదేవతయైన ఏకాదశీదేవి మహా విష్ణు అంశయే. సూర్యుడు ధనురాశిపై నుండగా వచ్చిన తొలి ఏకాదశి (వైకుంఠ) పుణ్యదినాన తన దివ్యమంగళ రూపంతోవైకుంఠ ద్వారంవద్ద దేవతలకు శ్రీమహావిష్ణువు దివ్యదర్శనం గావించిన సందర్భంగా, కోటి తేజోమూర్తిని దర్శించిన బ్రహ్మాది దేవతలు, సనకసనందాది మునులు, పశ్యన్ నిముష మాత్రేన కోటి యజ్ఞంఫలం లభేత్2 అని వచించినట్లు బ్రహాండ పురాణంలో వర్ణించబడింది. ఈపవిత్రదినాన ఆలయాలలో ఉత్తర ద్వారంవద్ద సూర్యోదయానికి పూర్వమే స్వామి దర్శనం చేసుకోవడం సత్సాంప్రదాయం.

- సంగనభట్ల రామకిష్టయ్య