పర్యాటకం

కుంఢలేశ్వరం.. శివలీలల దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవిత్రమైన గోదావరి నది చెంతన, కోనసీమలో పచ్చని పంట పైరులు, కొబ్బరి చెట్ల మధ్య కుండలేశ్వర ఆలయం ఉన్నది. కుండలేశ్వర క్షేత్ర విశిష్టతను, మహత్తును గౌతమీ మహాత్యమను గ్రంథములో ప్రస్తావించబడినది. వృద్ధ గౌతమీనది పుణ్యజలంలో స్నానమాచరించి, ఆ తర్వాత కుండలేశ్వరుని దర్శించి, భక్తిశ్రద్ధలతో పూజలు జరిపిస్తారు. కుండలేశ్వరము దక్షిణ కాశీగా పేరుపొందింది. ఈ క్షేత్రమును గురించి, శ్రీ శంకరాచార్యులవారు రచించిన చంద్రశేఖరాష్టకంలో మార్కండేయులు చేత తెలియచేయబడింది.
కుండలేశ్వర ఆలయ విమాన గోపురం మీద 23 శివలీలలు వర్ణింపబడి ఉన్నాయి. శివుని వివిధ రూపాలు, ఆ విమాన గోపురం మీద దర్శనమివ్వడమన్నది ఈ ఆలయపు ప్రత్యేక విశేషం. ఆ రూపాలు 1) నటరాజస్వామి 2) వీరభద్రుడు 3) లింగోద్భవమూర్తి 4) సోమాస్కందమూర్తి 5) భిక్షాటనమూర్తి 6) కిరాతమూర్తి 7) హరిహరమూర్తి 8) కల్యాణసుందరమూర్తి 9) చండశానుగ్రహమూర్తి 10) శరభసాళ్ళమూర్తి 11) అర్థనారీశ్వరుడు 12) మన్మధ సంహారి 13) గణేశానుగ్రహమూర్తి 14) ఏకపాదుడు 15) వృషభారూఢుడు 16) దక్షిణామూర్తి 17) ఆజారిమూర్తి 18) విషాన హరుణుడు 19) కంకాళుడు 20) త్రిపురాసుర సంహారుడు 21) చక్రపధానుడు 22) చండశానుగ్రహుడుతోపాటు ముఖ మంటపంపైన భక్తమార్కండేయుడు ఉంటాడు.
వ్యాస మహర్షి ఆగ్రహంతో కాశీనుంచి వచ్చిన సమయంలో కుండలేశ్వరంను దక్షిణ కాశీగా నూ, సమీపంలో ఉన్న, వ్యాసునిచే ప్రతిష్టింపబడిన వ్యాసేశ్వరుని గ్రామమున కేశవకుర్రును వ్యాసకాశీగానూ చేయాలని నిశ్చయించుకున్నాడు. కాశీలోని గంగానదిలో, అనేక వేల మంది భక్తులు స్నానమాచరించి, తమ పాపాలను ప్రక్షాళన చేసుకుంటున్నారు. గంగామాతకు అంటుకున్న ఆ పాపాలను పోగొట్టుకోలేక కాశీనుంచి వచ్చి రాత్రి సమయంలో, కుండలేశ్వర క్షేత్రంలో ని వృద్ధ గౌతమీనదిలో మునిగి, ఆ నీటిలో స్నానమాచరించి, తనలోని మలినాలను పోగొట్టుకుని ఆ నీటిలో హంసలాగా విహరించేదని ఆనాటి తపోధనులు, మహర్షులు, మునీశ్వరులు తెలియచేసేవారట. గౌతమీ నది సముద్రుని కలిసిన కుండలేశ్వర క్షేత్రంలో, సముద్రుడు గౌతమీ నదికి కానుకగా రెండు కుండలములను ప్రసాదించాడు. అందులో ఒకదానిని మానవులు శ్రేయస్సుకొరకు కుండలేశ్వర క్షేత్రమును స్థాపించడం, రెండవ కుండలమును దేవతల కొరకు నదీగర్భంలో స్థాపించబడినదని ఆ గ్రామ ప్రజలు చెప్తారు.
నదీ గర్భంలో స్థాపించబడిన పరమేశ్వరునికి దేవతలు కంచుతో ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణం వెల్లడిస్తోంది. దేవతలు ఈశ్వరునికి పూజాభిషేకాలు జరుపుతున్నట్లుగా తెలియచేయబడింది. రాత్రి సమయంలో గోదావరీ నదిలోంచి, ఆ ప్రాంతాన కంచు మ్రోగిన ధ్వనులు వినిపిస్తాయని వృద్ధులు ఎందరో నమ్మకం చెప్తున్నారు. గౌతముడు ఒక వృద్ధ స్ర్తితో కలసి ఈ కుండలేశ్వర క్షేత్రానికి వచ్చి, ఈ నదిలో స్నానం చేసిన తర్వాత, ఆ వృద్ధ మహిళ 16 సంవత్సరాల కన్యగా మారిపోయిందనీ, గౌతముడు 20 సంవత్సరాల యువకునిగా మారినట్లు, ఆ తర్వాత వారిద్దరూ దంపతులై నూతన జీవితాన్ని ఆరంభించినట్లుగాను స్థల పురాణం ద్వారానూ, గౌతమీ మహాత్యమను గ్రంథం ద్వారాను తెలియచేయబడింది.

- కె.నిర్మల