సబ్ ఫీచర్

సెలవింక డెమోక్రసీ.. సిరిసిరిమువ్వా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతా ఆ తాను ముక్కలే.. వైసీపీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేల చేత ఏపిలో గవర్నరు మహాశయుడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు వర్తమాన రాజకీయాలను నిశితంగా పరిశీలించేవారికి కలిగిన భావన ఇది! టిడిపి టిక్కెట్‌పై గెలిచిన తలసాని శ్రీనివాసయాదవ్‌తో ఇదే నరసింహుడు తెలంగాణలో మంత్రిగా ప్రమాణం చేయించినప్పుడు- ‘ప్రజాస్వామ్యం గొంతు నులిమేశారు, అది రాజకీయ వ్యభిచారమేనంటూ టివి గొట్టాల ముందు, రచ్చలాంటి చర్చాగోష్టుల్లో గావుకేకలు పెట్టి, శోషొచ్చి పడిపోయిన ఇదే ప్రజాస్వామ్య పరిరక్షకులు- నవ్యాంధ్రలో చేసిన ఘనకార్యం చూస్తే- ‘మేం చేస్తే సంసారం, ఎదుటివాళ్లు చేస్తే వ్యభిచారమ’న్న సామెత గుర్తురాక మానదు.
తలసానికి మంత్రి పదవి ఇవ్వడాన్ని ఒకవేలుతో తప్పుపెట్టిన తెలుగుతమ్ముళ్లు, తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో అదే పని చేసినప్పుడు నోరు మెదిపితే ఒట్టు. ఇంకా తెలంగాణలో తలసాని ఏదో మొహమాటం కో సమో, రాజ్యాంగ రక్షణ ముసుగు కోసమో ఎమ్మెల్యే పదవికి రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు పంపించారు. సరే.. ఎలాగూ స్పీకర్ అధికార పార్టీ గీసిన గీత దాటరు కాబట్టి, దానిని ఆయన వచ్చే ఎన్నికల వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, ఆ లేఖను బుట్టదాఖలు చేస్తారన్నది అందరికీ తెలిసిందే. నవ్యాంధ్రలో అంత పాలనానుభవం ఉన్న తెలుగుదేశాధిపతి ఆపాటి సూత్రం కూడా పాటించకపోవడమే ఆశ్చర్యకరం. తలసానితో రాజీనామా చేయించకుండా, వేరొక పార్టీ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వడాన్ని సమర్థించలేం. కానీ, ఆ విధానాన్ని తప్పుపట్టి, ఆయనను గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచార సమయంలో జనం ముందు ముద్దాయిగా నిలబెట్టిన తెలుగు ఏలిక, తమ రాష్ట్రంలోనూ అదే విధానాన్ని అనుసరించడమే ఆక్షేపణీయం. వ్యక్తులు, పార్టీల మాదిరి చరిత్రకు పక్షపాతం ఉండదు. ఒక తప్పు జరిగితే- అంతకుముందు, ఆ తర్వాత తప్పులను ఎప్పుడూ వేలెత్తి ప్రశ్నిస్తూనే ఉంటుంది. అందుకే రాజకీయనేతల నాలికలు ఎప్పుడూ మడతపడకుండా జాగ్రత్త పడాలి. ఏపి-తెలంగాణ ఫిరాయింపుల వ్యవహారంలో అందరికీ అనుభవంలోకొచ్చింది ఇదే!
తెలుగు రాష్ట్రాల ఫిరాయింపుల్లో ‘రాజకీయ హరిశ్చంద్రుల’ మాటలు అలా ఉంచి, అదే వ్యవహారంపై ఇతర పార్టీలు వల్లెవేస్తున్న నీతులు చూస్తే ప్రజాస్వామ్యం పట్ల ఆ పార్టీలకు ఎంత ప్రేమ కారిపోతుందోనన్న అనుమానం వస్తోంది. ప్రధానంగా వైసీపీ నేత వైఎస్ జగన్ అండ్ కో, ఇంకా తామూ బతికున్నామని చెప్పడానికి అప్పుడప్పుడు పత్రికల్లో ప్రకటనల పేరుతో మనుగడ సాగిస్తున్న కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి ట్రూపు, వీరికి జతకట్టిన అన్నగారి ముద్దుల పుత్రిక ‘చిన్నమ్మ’ చేసిన ప్రకటనలు చూస్తే- వీరికి ఇప్పటివరకూ ఎవరూ ప్రజాస్వామ్య పరిరక్షకులన్న బిరుదు ఎందుకివ్వలేదా? అన్న అనుమానం రాకతప్పదు.
ఫిరాయింపులపై రాష్టప్రతి వరకూ ఢిల్లీలో గుండెలవిసేలా టన్నులకు టన్నుల ఆవేదనను కుమ్మరిస్తున్న జగనన్నయ్య, త న తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జమానాలో నిస్సిగ్గుగా జరిగిన ఫిరాయింపుల క్రీడను ఎంపీగా ఉన్నప్పుడే ప్రశ్నిస్తే జగన్‌బాబు ఆవేదన నిజమనిపించేది. అసలు మహానేత అయిన తండ్రిగారే రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎన్నికై అసలు కాంగ్రెస్‌లో చేరి మంత్రి అయిన నిజాన్ని తెలుగుతమ్ముళ్లు గుర్తుచేసినా యువనేతలో స్పందన లేదు. ఈ యువనేత వరకూ తన పార్టీలో చేరిన అప్పటి కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి మళ్లీ ఎన్నికలకు వెళ్లిన ధైర్యాన్ని మెచ్చకుండా ఉండలేం. కానీ, ‘మహానేత’ జమానాలో జరిగిన తప్పొప్పులూ కొడుకు ఖాతాలో పడక తప్పదు కదా? అలా కొన్నింటికి స్పందించి, మరికొన్ని తప్పులకు తనది బాధ్యత కాదన్నట్లు ఉంటే ఎలా చెల్లుతుంది?
మహానేత బతికున్నరోజుల్లో టీఆర్‌ఎస్‌ను చీల్చారే? కాసాని జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి పోటీ చేస్తే ఆయనకు మద్దతునిచ్చారే? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్‌తో వణికించారే? ఇవన్నీ రాష్టప్రతి భవన్‌లో కాలుపెట్టిన జగనన్నయ్యకు తెలుసా? తెలియవా? ఏం చదివారో చెప్పకపోయినా, ఇంగ్లీషు బాగా చదువుకున్న జగన్ అప్పటి ఫిరాయింపు బాగోతం ఇంగ్లీషు పేపర్లో చూసిన తర్వాతైనా ఎందుకు స్పందించలేదు? ఫిరాయింపు రాజకీయాలకు మూలపుటమ్మ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ అంశంపై చేస్తున్న విమర్శలు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్నట్లుంది. ఇందిరమ్మ నుంచి సోనియమ్మ వరకూ వెలగపెట్టింది అదే కదా? ప్రభుత్వాలను కూల్చిన మారాజులు ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటూ పెద్దమాటలు మాట్లాడుతున్నారు.
‘చిన్మమ్మ’ పురంధ్రీశ్వరి తాను కూడా మాట్లాడకపోతే బాగుండదనో, లేక మరిదిగారి మీద పీకలవరకూ ఉన్న కోపంతోనో ఫిరాయింపులను ఉతికి ఆరేసి- అంతటితో ఆగకుండా, ప్రధానికి, భాజపా అధ్యక్షుడికి ఓ లేఖ పారేశారు. తన తండ్రి హయాంలో ఇలా జరగలేదని చెప్పిన చిన్నమ్మ, మొన్నీమధ్య తమ ఏలుబడిలోనే మణిపూర్‌లో జరిగిన ‘ ప్రజాస్వామ్య విలువల ప్ర తిష్ఠాపన’ను మాత్రం మర్చిపోయినట్టున్నారు. తమ పార్టీకి బ లం లేకపోయినా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను అరువు తెచ్చుకుని, గవర్నరనే పెద్దమనిషిని అడ్డుకుని అప్పనంగా అధికారం తెచ్చుకున్న మొన్నటి ఎన్నికల అనంతర ఫలితాలను చిన్నమ్మ మర్చిపోయారెందుకో మరి! అయినా ఏ మాటకామాటే చెప్పాలి. బిజెపిలో దమ్మున్న మగాడెవరూ ఫిరాయింపులపై నోరు విప్పని పరాధీన పరిస్థితిలో, పురంధ్రీశ్వరి ఆపాటి ధైర్యమయినా చేయగలిగారు. అప్పట్లో అన్నగారు రేణుకాచౌదరిని పార్టీలో ‘ఏకైక మగాడు’ అని భుజం తట్టినట్లే, ఇప్పుడు బిజెపిలో ‘ఒక్క మొగాడు’ అయిన పురంధ్రీశ్వరిని అభినందించేవారే లేరు.
చిన్నమ్మ వ్యాఖ్యలపై ఇంతెంత్తున లేచిన తెలుగుతమ్ముళ్లు- ‘మీకు జగన్ అవినీతి, మీరు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఫిరాయింపులు కనిపించలేదా?’ అని ఎదురుదాడి చేశారే తప్ప. ఫిరాయింపులపై కఠిన చట్టం తీసుకురావాలని రెండురోజుల ముందు సెలవిచ్చిన తెలుగుదేశ హితైషి, పెద్దమనసున్న నెల్లూరు నాయుడుగారి మీద మాత్రం తమ్ముళ్లు పల్లెత్తుమాట అనకుండా కిమ్మనకుండా ఉండటాన్ని తప్పుపట్టలేం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో తప్ప, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ బిజెపి అధికారంలోకి రావాలని కోరుకునే ‘తెలుగుజనతా’నేతలున్నప్పుడు వారినెందుకు విమర్శిస్తారు? అప్పుడెప్పుడో మోదీని తమ్ముళ్లు పబ్లిగ్గా తిట్టినా ఈ ‘తెలుగుజనతా’నేతలు కిమ్మనలేదు. అదే పవన్ కల్యాణ్ అనే చిన్నపార్టీ ఆసామి వెంకయ్యపై విరుచుకుపడితే మాత్రం ఇదే తెలుగుజనతా నేతలతోపాటు, ‘తెలుగుమంత్రి’ గారు కూడా కట్టకట్టుకుని ఎదురుదాడి చేశారు. కాబట్టి వారి నుంచి ఆ విమర్శను ఆశించడమే నేరం. అప్పుడెప్పుడో అమిత్‌షాజీ ఏపి కమలనాథులతో మాట్లాడుతూ, ‘వాళ్లూ వీళ్లూ ఎందుకు? మీరు సీఎం కావాలని ఎందుకు కోరుకోరని ‘తెలుగుజనతా’ ఎంపీ గారిని అడిగితే సదరు ఎంపిగారు ఇబ్బందిపడిపోయారట!
* * *
ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఏపి మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఎట్టకేలకు ముగిసింది. వైసీపీ నుంచి అరువు తెచ్చుకున్న నలుగురు ఎమ్మెల్యేలకు కొలువులో చోటిచ్చారు. పనిలోపనిగా ‘చినబాబు’కూ పట్ట్భాషేకం చేశారు. సంతోషం. ఆ సందర్భంగా ‘పుట్టు తెలుగుదేశీయులు’ కొందరు రేపిన అసంతృప్తి సెగ నాయకత్వానికి తాకింది. ఈ సెగ వేడి ఎక్కువగా తగలినట్లు కనిపించకుండా మీడియా రాజగురువులుంగారు, తన మీడియాలో దానిని తక్కువచేసి చూపేందుకు ఎంత కష్టపడినా, బాబుగారు మాత్రం దాని ప్రభావం పార్టీపై పడిందని అననే అనేశారు.
అరువు తెచ్చుకున్న వారు తప్ప మంత్రులయ్యే మొనగాళ్లే పార్టీలో లేరా? అని ప్రశ్నించిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి అమాయకత్వాన్ని చూస్తే జాలేయక తప్పదు. పార్టీలో మొనగాళ్లనుకుంటున్న వారిలో బాబుగారు కోరుకున్న లక్షణాలు లేకపోయి ఉండవచ్చు. పైగా పక్క పార్టీల నుంచి వచ్చినవారిలోనే ఆ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు భావించి ఉండవచ్చు. పాతవారిలో ఉడుకు నెత్తురు ఇంకిపోయినట్లు అనుమానించి ఉండవచ్చు. లేదా బుచ్చయ్యచౌదరి వంటి నేతల వల్ల పార్టీకి పెద్దగా ఉపయోగం లేదనీ భావించి ఉండవచ్చు.
పార్టీకి కొత్త రక్తం కావాలని, ఆ రక్తం కూడా పక్క పార్టీల వాళ్లదైతే బాగుంటుదని కోరుకుని ఉండవచ్చు. బుచ్చయ్య, బండారు, గౌతు శివాజీ వంటి నేతలు ఇంకా సత్తెకాలంలోనే ఉన్నట్లున్నారు. బాబుగారిలా ‘అప్‌డేట్’ కాకపోతే వెనకబడిపోతారు. ‘మంత్రుల అర్హతల’పై బాబు లెక్కలు బాబుకుంటే, తమ ప్రతిభపై ఆశావహుల లెక్కలు ఆశావహులకుంటాయి!
*

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144