సబ్ ఫీచర్

సుస్థిరత కోసమే చేరికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్ర సమితిలో, వారూ-వీరూ అనే తేడా లేకుండా, ఆ పార్టీ-ఈ పార్టీ అనే భేదం లేకుండా, అను నిత్యం, ఎన్నికైన వివిధ స్థాయి ప్రజాప్రతినిధులతో సహా, వేలాదిమంది రాజకీయ కార్యకర్తలు చేరడం రాజకీయ పునరేకీకరణ ఆవశ్యకత మాత్రమే. ఒక మహోన్నత ఉద్యమ నేపథ్యంలో ఒక పార్టీ టికెట్‌పై గెలిచి, మరో పార్టీలో చేరడం సమంజసమే. ఇది అనైతికమనే వారికి రాజకీయ పునరేకీకరణ ఆవశ్యకత అంతగా అర్థం కాదు. పార్టీ మారుతున్న వారి దృష్టిలో తాము మరో పార్టీలో చేరుతున్నామనే భావనకన్నా ఆ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్భ్రావృద్ధికి అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనాలన్న లక్ష్యం మిన్నగా ఉంది. గతంలో వారు ప్రాతనిధ్యం వహించిన పార్టీలు ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతిపక్ష పాత్ర పోషించలేని దుర్గతిలో ఉండడమే వారంతా ఆయా పార్టీలను వదిలి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడానికి కారణమనేది నిర్వివాదాంశం.
తెలంగాణను అడ్డుకోవడానికి అడుగడుగునా కుట్రలు జరిగినట్లే, సాధించుకున్న తెలంగాను అస్థిరపరచడానికి కూడా వరుస కుట్రలు జరిగాయని, వాటన్నింటినీ ఎదుర్కోవడానికి రాజకీయ పునరేకీకరణ అవసరముందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పదేపదే చెబుతూంటారు. చెన్నారెడ్డి ఆధ్వర్యంలో 1969లో జరిగిన మహోన్నత ఉద్యమం నుంచి 2014 వరకు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా కుట్రలు జరిగాయి. ఈ ఉద్యమాల నేపధ్యంలో లోతుగా ఆలోచిస్తే, రాజకీయ అవసరాల కోసం ఆషామాషీగా చేరికలు జరగడం లేదని, తెలంగాణ గెలిచి నిలిచేందుకు అనుసరిస్తున్న వ్యూహంలో భాగంగానే పునరేకీకరణ జరుగుతున్నదని స్పష్టంగా అర్థమవుతుంది.
తెలంగాణ రాష్టస్రాధనే లక్ష్యంగా 2001లో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఒక్కడే ఉద్యమ దిశగా బయలుదేరాడు. తర్వాత కొద్దిమంది మిత్రులు ఆయనతో జమయ్యారు. తెలంగాణ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే విషయంపై ప్రతి ఒక్కరితో చర్చలు జరిపారు కేసీఆర్. 1969లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారితో కూడా మాట్లాడారాయన. వారు వారి అనుభవనాలను కేసీఆర్‌తో పంచుకున్నారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజకీయ చర్యల ద్వారా తెలంగాణ సాధించాలన్న తన వ్యూహాన్ని, తన మనసులో వున్న ఆలోచనలు వారికి వివరించారు. కానీ వారు ఈయన వ్యూహాన్ని అంగీకరించలేదు. దానివల్ల తెలంగాణ రాదని చెప్పారు. 1969 లాగానే ఉద్యమం నడవాలని వారు కోరుకున్నారు. కానీ కేసీఆర్ వినలేదు.
‘‘మీకు స్టేట్‌ఫైట్ కావాలా? స్ట్రీట్ ఫైట్ కావాలా?’’ అని వాళ్లను ప్రశ్నించారు. తాను ‘‘స్టేట్‌ఫైట్’’ చేస్తాను కానీ ‘‘స్ట్రీట్ ఫైట్’’ చేయలేనని అని అంటూ, స్ట్రీట్ ఫైట్ కోసం తాను అవసరం లేదని కూడా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కేవలం జై తెలంగాణ నినాదాలతోనే తెలంగాణ రాదని అన్నారు. చాలా వ్యూహాత్మకంగా, డిప్లమాటిక్‌గా ముందుకుపోవాలని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం ఆంధ్రప్రజలకు వ్యతిరేకం కాదని కూడా ఆనాడే స్పష్టం చేశారు. తాను నడిపే ఉద్యమంలో ‘‘ఆంధ్ర గో బ్యాక్’’ నినాదాలు ఉండవన్నారు. ‘‘మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు మనకు దక్కడం కోసం తెలణగాణ కావాలి కానీ, ఎవరికో వ్యతిరేకంగా కాదని’’ చెప్పారు. అలా తన అభిప్రాయాలను, వ్యూహాలను ఒక్కొక్కరికీ విడమరచి చెప్పారు. చర్చోపచర్చలు సాగాయి. మూడు నాలుగు వేల గంటల చర్చలు సాగాయి. ఎంతో మేధోమథనం జరిగింది. తెలంగాణ ఎట్ల వస్తదని అడిగినవారికి తెలంగాణ సాధన అనేది మన కన్విక్షన్‌పై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఉద్యమం నడిపే తీరుపైనే తెలంగాణ సాధన అనేది ఆధారపడి ఉంటుందని కూడా వివరించారు. తెలంగాణ సమాజాన్నంతా ఒకవైపునకు తిప్పగలిగితే ప్రత్యేక రాష్ట్రం వస్తుందని అన్నారు. చివరకు తెలంగాణ ఉద్యమం పట్ల తనకున్న వ్యూహాన్ని వారు అర్థం చేసుకున్నారు. అప్పటి నుంచి కేసిఆర్ వెంటే అందరూ నడిచారు.
తెలంగాణ ఉద్యమం ఓ రాజకీయ పార్టీగా ముందుకుపోతుండడంతో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, ఆంధ్ర శక్తులు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు రకరకాల పద్ధతుల్లో ప్రయత్నాలు చేశారు. ప్రధానంగా విభజించి పాలించు ఎత్తుగడతో తెలంగాణ సమాజంలో ఐక్యతను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. తెలంగాణ నాయకత్వ వ్యక్తిత్వ హననం రెండవ ఎత్తుగడ. ఉద్యమ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత లేకుండా చేయడం దాని పరమార్థం. మీడియా ద్వారా అబద్ధాలు ప్రచారం చేయడం, ప్రభుత్వ అండతో ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించడం మిగతా రెండు పద్ధతులు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, బెదరింపులు వచ్చినా ఉద్యమాన్ని కేసీఆర్ కొనసాగించారు.
2004 ఎన్నికల తరువాత కేసీఆర్ కేంద్రమంత్రి అయ్యారు. ఢిల్లీలో ఎక్కువ సమయం గడిపారు. కేంద్రమంత్రిగా ఉన్నంతకాలం ఢిల్లీలో అన్ని రాకీయ పార్టీల చుట్టూ తిరిగారు. తెలంగాణ ఏర్పడడానికి అనుకూలంగా 36 రాజకీయ పార్టీలను ఒప్పించారు. సిపిఐ బర్దన్‌తో 30 సార్లు సమావేశమయ్యారు. మాయావతితో 19 సార్లు సమావేశమయ్యారు. అప్పుడు తెలంగాణ పడుతున్న గోస గురించి, ప్రత్యేక రాష్ట్రం కావలస్ని అవసరం గురించి సీడీ తయారు చేయించి, ఢిల్లీలో నాయకులందరికీ చూపించారు. ప్రతి ఎంపీకి, ప్రతీ పార్టీకి కొరియర్ చేశారు. అందరికీ తెలంగాణ గోస అర్థమయింది కానీ, తెలంగాణ వస్తుందనే నమ్మకం చాలామందికి లేకుండె. ఎంత చేసినా సరే తెలంగాణ రాదు అనే అపనమ్మకం ఏర్పడడానికి గత అనుభవం కూడా ఓ కారణమే.
1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సారధ్యం వహించిన స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గొప్ప తెలంగాణ బిడ్డ. ఆయన ఉద్యమాన్ని ఆకాశం ఎత్తుకు లేపారు. ఆనాటి ఆయన ఉద్యమం మలివిడతగా చేపట్టిన కేసీఆర్ సారధ్యంలోని ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందనాలి. 1970-71లో ఇందిరకు మాస్ లీడర్‌గా మంచి పేరొచ్చింది. పాకిస్తాన్‌తో యుద్ధానికి ముందు ఇందిర 30-40 దేశాలకు వెళ్లి అక్కడి నాయకులతో మాట్లాడింది. తాను చేయబోయే బంగ్లాదేశ్ విమోచన గురించి చెప్పింది. చివరకు బంగ్లాదేశ్ ఏర్పాటైంది. దరిమిలా ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. దేశమంతా ఇందిర పార్టీ గెలిచినా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో చెన్నారెడ్డి నాయకత్వంలోని ప్రజాసమితి, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోటీచేసి 11 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. వీళ్లందరినీ తీసుకుని చెన్నారెడ్డి ఇందిరాగాంధీ దగ్గరకు వెళ్లారు. ఆమె ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అని, ప్రజల కోరిక మన్నించి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
ఇందిరాగాంధీ డాంగే సలహా తీసుకుంది. ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటు చేస్త ఇలాంటి డిమాండ్లు ఎన్నో వస్తాయని, తెలంగాణ ప్రజలు అడిగిందేదైనా ఇవ్వొచ్చు కానీ, ప్రత్యేక రాష్ట్రం మాత్రం ఇవ్వొద్దని సలహా ఇచ్చారు ఆయన. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం రావడం లేదని తెలిసిపోయిందో అప్పుడే నాయకత్వాన్ని తిట్టడం మొదలైంది. కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నం చేశారు. అందరం కలసి చేరుదామని చెప్పిన చెన్నారెడ్డి, ఇందిర నుంచి కొన్ని సేఫ్‌గార్డ్స్‌కు అంగీకరించేలా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలోని కొందరు చెన్నారెడ్డిని ద్రోహిగా చిత్రీకరించడం వెనుకకూడా ఆంధ్రావాళ్ల కుట్ర వుంది. ఆంధ్ర పత్రికల పాత్ర కూడా ఉంది.
చెన్నారెడ్డి రోజుల నుంచి నేటిదాకా ఆంధ్రా వాళ్ల కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కూడా దీన్ని అస్థిరపరిచే కుట్ర జరిగింది. తెలంగాణ బతికి బట్టకట్టదని ప్రచారం జరిగింది. మనుగడ సాగదని అన్నారు. రాష్టప్రతి పాలన విధించే ప్రయత్నాలు కూడా జరిగాయి. టీఆర్‌ఎస్‌కు స్నేహంగా ఉండే మజ్లిస్ పార్టీ ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా ఉంటామని ప్రకటించిన తరువాత శాసనసభలో పార్టీ బలం 63 నుంచి 70 కి చేరింది. అలా.. అలా ప్రభుత్వానికి అండగా వుండాలని భావించి చాలామంది టీఆర్‌ఎస్‌తో కలిసారు. ఇంకా కలుస్తున్నారు. శాసనసభలో సంఖ్య 90 కు చేరుకుంది. రాజకీయ స్థిరత్వం పూర్తిగా వచ్చింది. ఇతర పార్టీల నుండి వచ్చిన వారి చేరికతో పార్టీ-ప్రభుత్వం మరింత బలపడుతున్నది. తెలంగాణ అన్ని రకాల బాగుపడాలి. ఇతర పార్టీల నుండి వచ్చినవారివి చిల్లర రాజకీయాల కోసం టీఆర్‌ఎస్ చేర్చుకోవడం లేదు. తెలంగాణ నిలిచి గెలవాలి. ఈ రోజు తెలంగాణ ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే శక్తులన్నీ ఏకమై, తెలంగాణను అభివృద్ధి చేయాలి. తెలంగాణలో రాజకీయ సుస్థిరత, ఆర్థిక సుస్థిరత సాధించడం జరిగింది. ఇదే పంథా కొనసాగాలి. అందుకోసమే పునరేకీకరణ అవసరమైంది.

-వనం జ్వాలా నరసింహారావు