S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తస్లీమ్, దివిజ, శ్రేష్ఠ, చరణ్, హర్ష ప్రధాన తారాగణంగా హెచ్.డి.విజన్ ఇండియా పతాకంపై రషీద్బాషా దర్శకత్వంలో ఇబ్రహీం షేక్, అమీర్బాషా షేక్, ఖాజాబి షేక్, నజీమ్షేక్ రూపొందించిన ‘లిటిల్ స్టార్స్’ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 12న విడుదలకు సిద్ధమైంది.
ఆనంద్నంద, రేష్మీ, శివకృష్ణ ప్రధాన తారాగణంగా డి.దివాకర్ దర్శకత్వంలో వి.సినీ స్టూడియో నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘రాణిగారి బంగళా’. షూటింగ్ పూర్తిచేసిన ఈ చిత్రానికి సంబంధించిన లోగో విడుదల హైదరాబాద్ ఫిలిమ్ ఛాంబర్ హాలులో నిర్వహించారు.
రమ్యశ్రీ కథానాయికగా నటించి, దర్శకత్వం వహించి రూపొందించిన చిత్రం ‘ఓ మల్లి’. ఆర్.ఎ. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బి.ప్రశాంత్ రూపొందించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని మార్చి 4న విడుదలకు ముస్తాబౌతోంది.
ఆదర్శ చిత్రాలయ ప్రైవేటు లిమిటెడ్ సత్యా ప్రభాస్ పినిశెట్టి దర్శకత్వంలో ఆది కథానాయకుడుగా భారీఎత్తున రూపొందిన చిత్రం ‘మలుపు’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ 19న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రవిరాజా పినిశెట్టి మాట్లాడుతూ తన పెద్ద కుమారుడు సత్యప్రభాస్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించామని, ఉన్నతమైన సాంకేతిక విలువలతో నిర్మించామని చెప్పారు.
‘ఆగడు’ అపజయంతో కాస్త డిజప్పాయింట్ అయిన శ్రీనువైట్ల ఆ తరువాత రామ్చరణ్తో రూపొందించిన ‘బ్రూస్లీ’ కూడా బోల్తాపడింది. ఇప్పుడు మళ్లీ తన ఇమేజ్ను ప్రూవ్ చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ఇప్పుడు శ్రీనువైట్ల సుధీర్బాబు హీరోగా ఓ సినిమా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే వీరిమధ్య కథా చర్చలు జరిగాయని తెలిసింది. అలాగే మహేష్తోకూడా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
జాతీయ నటుడు కమల్హాసన్ మంచి నటుడే కాదు అప్పుడప్పుడు పాటలూ పాడుతూంటారు. ఇప్పుడు ఆయన ఓ హీరోకోసం పాట పాడుతున్నాడు.
ముంబై-సోషల్ మీడియాలో బిగ్బి అమితాబ్ బచ్చన్ హవా మరింత పెరిగింది. ప్రస్తుతం ఆయనకు ఫేస్బుక్లో 23 మిలియన్లమంది లైక్స్ వచ్చాయి. ఆయనను అనుసరిస్తున్నవారి సంఖ్య ఫిబ్రవరి 5వ తేదీనాటికి 23,032,439కు చేరుకుందని ఆయన స్వయంగా ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇటీవలే విడుదలై సంచలన విజయం సాధించిన ‘కుమారి 21ఎఫ్’ తరహాలో రూపొందిన మరో చిత్రం ‘కుమారి మల్లిక’. రంజన్శెట్టి, రూపానటరాజన్, శే్వతావిక్రమ్ ప్రధాన పాత్రల్లో ఆస్కార్ కృష్ణ దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన మిస్ మల్లిక చిత్రాన్ని తెలుగులో కుమారి మల్లిక పేరుతో విడుదల చేస్తున్నారు.
హిందీ సీరియళ్లతో, ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అవికాగోర్ చేసిన చిత్రాలు తక్కువైనా మంచిపేరు తెచ్చుకుంది. హీరోయిన్గా ఓ వెలుగువెలుగుతున్నా ఆ మధ్య కాస్త లావెక్కడంతో అవకాశాలపై ఆ ప్రభావం కన్పిస్తోంది. అందుకే కొత్తగా జిమ్కు వెళ్లి బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నం మంచి ఫలితానే్న ఇస్తోంది. ఇప్పుడు కాస్త స్లిమ్గా కన్పిస్తూ అందర్నీ ఆకర్షిస్తోంది.
శ్రీ ఓం డి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఆదర్శ్బాబు, పావని జంటగా అజ్మీరా చందు దర్శకత్వంలో ఎ.ఎస్.రావు రూపొందిస్తున్న కుటుంబ కథా చిత్రం ‘నాన్న.. నేను..వర్ష’. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన తొలి కాపీ ఈనెల 10కి సిద్ధం కానుంది.