S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నందమూరి కళ్యాణ్రామ్, కాజల్ జంటగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కిన ఎంఎల్ఏ (మంచి లక్షణాలున్న అబ్బాయి) చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్తో రన్ అవుతున్న సందర్భంగా నిర్మాతలు భరత్ చౌదరి, కిరణ్రెడ్డి పలు విశేషాలు మీడియాతో పంచుకున్నారు. భరత్ చౌదరి మాట్లాడుతూ- నేను మొదటినుంచీ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాను. పలు చిత్రాలు విడుదల చేశాను.
నృత్య దర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా ఇండియన్ మైఖేల్ జాక్సాన్గా పిలుచుకునే ప్రభుదేవాకు తెలుగునాట వున్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని గులేబకావళి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాం. యూనివర్సల్ పాయింట్తో తెరకెక్కిన ఈ చిత్రంలో కథ, కథనాలు చాలా ఆసక్తికరంగా వుంటాయి అంటున్నారు నిర్మాత మల్కాపురం శివకుమార్. ప్రభుదేవా, హన్సిక జంటగా నటించిన తమిళ చిత్రం గులేబకావళి. కల్యాణ్ దర్శకత్వం వహించారు.
తమిళ ‘చతురంగ వేట్టై’ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆశ, అత్యాశల మధ్య ఆసక్తికరంగా సాగిన ఈ కథకు తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. భావోద్వేగాలకు ప్రాంతీయ బేధాలుండవు. ఎక్కడైనా ఈ కథ నీరాజనాల అందుకుంటుందనే నమ్మకంతో ఆ కథను తెలుగు ప్రేక్షకులకోసం తెరకెక్కిస్తున్నారు అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లై.
మొత్తానికి సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ అనగానే సినిమావాళ్ళకి పెద్దపండగ. దాదాపు రెండు నెలలపాటు సినిమాలని భారీగా విడుదల చేసుకోవచ్చు. పరీక్షలు అయిపోగానే వేసవి సెలవులు వచ్చేస్తాయి. వేసవి సెలవులంటే పిల్లలతోపాటు పెద్దలకూ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక సినిమావాళ్లు కూడా ఈ సమ్మర్లో తమ సినిమాల్ని విడుదల చేసి క్రేజ్ తెచ్చుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తుంటారు.
ప్రముఖ నటుడు రామ్చరణ్ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’ చిత్రం ఈనెల 30న భారీగా విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్ పొందింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 1980 నేపథ్యంలో జరిగే కథతో సాగుతుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పాయి. ఈ సినిమా తరువాత బోయపాటి చిత్రంలో నటిస్తున్నాడు చరణ్.
మహానటుడు నందమూరి తారక రామారావు జీవితకథతో తెరకెక్కే సినిమాకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగువాడి సత్తాను ఖండాంతరాలకు చాటిన మహానేత నందమూరి తారక రామారావు బయోపిక్లో బాలకృష్ణ నటిస్తుండగా, తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్తోపాటు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రం ఈనెల 29న హైదరాబాద్లో భారీగా ప్రారంభం కానున్నట్టు వార్తలు వస్తున్నాయి.
‘నీతోడు కావాలి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి, ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి ఓ దశలో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. పలువురు స్టార్ హీరోల సరసన నటించి గ్లామర్ హీరోయిన్గా ఇమేజ్ అందుకున్న ఛార్మీకి ఆ తరువాత వరుస పరాజయాలు పలకరించాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన సినిమాలు కూడా బోల్తాపడడంతో ఆమెకి అవకాశాలు తగ్గాయి.
ఎన్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సూపర్హిట్ చిత్రాల దర్శకుడు కళ్యాణ్కృష్ణ దర్శకత్వంలో రాజా ది గ్రేట్తో అదరగొట్టిన మాస్ మహారాజు రవితేజ హీరోగా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ‘నేల టిక్కెట్టు’ చిత్ర యూనిట్ సభ్యులు తెలుగు ప్రేక్షకులకి శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. చిత్ర నిర్మాణం ముగింపు దశలో ఉంది.
ప్రముఖ సీనియర్ నటి జయంతి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో గత కొంతకాలంగా ఆమె బాధపడుతున్నారు. సమస్య తీవ్రం కావడంతో మంగళవారం తెల్లవారుజామున బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అత్యవసర చికిత్స విభాగంలో వైద్యం అందిస్తున్నారని ఆమె కుమారుడు కృష్ణ పేర్కొన్నారు.
ప్రముఖ తమిళ కమెడియన్ సంతానం, ఆంచల్ సింగ్ జంటగా శ్రీ తేన్నాండల్ ఫిల్మ్స్ బ్యానర్పై తెరకెక్కిన ‘దిల్లుడు దుడ్డు’ తమిళ చిత్రాన్ని ‘దమ్ముంటే సొమ్మేరా’ పేరుతో శ్రీకృష్ణా ఫిలింస్ బ్యానర్పై నటరాజన్ విడుదల చేస్తున్నారు. రాం బాలా దర్శకుడు. ఈ చిత్రం ఏప్రిల్ ద్వితీయవారంలో విడుదలవుతున్న సందర్భంగా సోమవారం హైదరాబాద్లో ట్రైలర్ను విడుదల చేశారు.