S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
టాలీవుడ్లో మాస్ దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వి.వి.వినాయక్, కమర్షియల్ ట్రాక్లోనే వెళుతున్నాడు. వినాయక్ సినిమా అంటే ఖచ్చితంగా కమర్షియల్ సినిమా అనే ఫీలింగ్తో ఉంటారు ప్రేక్షకులు. ఆయనకు కూడా కమర్షియల్ ఫార్ములాలోనే సినిమాలు చేయడం ఇష్టం. ఎందుకంటే, ఇది డబ్బుతో కూడుకున్న వ్యాపారం కాబట్టి, కమర్షియల్ అంశాలు ఉండాల్సిందేనని అంటున్నారు.
‘జైలవకుశ’ చిత్రం తరువాత ఎన్టీఆర్ హీరోగా నటించే చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావచ్చాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇదివరకే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చిలో ప్రారంభం కానున్నదట. ‘అజ్ఞాతవాసి’ పరాజయంతో కాస్త వెనక్కి తగ్గిన త్రివిక్రమ్, ఎన్టీఆర్ కోసం పవర్ఫుల్ స్క్రిప్ట్ను సిద్ధం చేస్తున్నాడని తెలిసింది.
నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ బ్యానర్పై ఉషా ముల్పూరి నిర్మించిన ‘్ఛలో’ చిత్రం ఇటీవలే విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్రం భారీ విజయం దిశగా పరుగులు తీస్తోంది. ఈమధ్య వరుస పరాజయాలతో టెన్షన్మీదున్న నాగశౌర్యకు ఈ విజయంతో కాస్త రిలీఫ్ కలిగింది. మొదటివారంలోనే వసూళ్లపరంగా కూడా మిలియన్ మార్క్ దాటేసి సంచలనం రేపుతోంది.
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్తో భారీ టెక్నికల్ విలువలతో తెరకెక్కిన ‘రోబో 2.0’ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మరోసారి నిరాశే కలగనుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదాపడ్డ ఈ సినిమా మరోసారి వాయిదా పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ చిత్రాన్ని ఏప్రిల్లో విడుదలకు ప్లాన్ చేశారు.
మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రవితేజ నటించిన తాజా చిత్రం ‘టచ్ చేసి చూడు’ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన కల్యాణ్కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో జరుపుకుంటోంది. సినిమాతోపాటు రవితేజ అటు శ్రీనువైట్లతో కూడా సినిమా చేసేందుకు ఓకె చెప్పిన విషయం తెలిసిందే.
యువ హీరో నితిన్ ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా వున్నాడు. అందులో ఒకటి కృష్ణచైతన్య దర్శకత్వంలో పవన్కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రం ఒకటైతే, మరొకటి దిల్రాజు బ్యానర్లో చేస్తున్న శ్రీనివాస కళ్యాణం. వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుని సెట్స్పైకి వచ్చేందుకు సిద్ధంగా వుంది.
కొత్తదనాన్ని అందించడంలో ఎప్పుడూ ముందుండే ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హీరోగానూ, భిన్నమైన సినిమాలు చేస్తూనే అటు నిర్మాతగా కూడా తన అభిరుచిని చాటుకుంటున్నాడు. తాజాగా ఆయనకు మరో భిన్నమైన పాత్ర చేసే అవకాశం వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. ఈమధ్య సౌత్లో కూడా మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువయ్యాయి. తాజాగా తమిళంలో ఓ మల్టీస్టారర్ సినిమాకోసం హీరో ధనుష్ ప్రయత్నాలు చేస్తున్నాడు.
టాలీవుడ్ లోకి ‘అందాల రాక్షసి’గా పరిచయమై తొలిచిత్రంతోనే తెలుగమ్మాయిగా చక్కటి ఇమేజ్ను తెచ్చుకుంది లావణ్య త్రిపాఠి. ఆ తరువాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చే పాత్రలు చేస్తూ క్రేజీ హీరోయిన్గా మారింది. వరుస సినిమాలతో బిజీగా మారిన లావణ్య తాజాగా ‘ఇంటిలిజెంట్’ చిత్రంలో నటిస్తోంది.
అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’. కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీ్ధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్కుమార్లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
నితిన్, మేఘా ఆకాష్ జంటగా కృష్ణచైతన్య దర్శకత్వంలో శ్రేష్ఠ్మూవీస్, పవన్కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై ఎన్.సుధాకర్రెడ్డి నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. త్రివిక్రమ్ కథ అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ను ఈనెల 12న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సుధాకర్రెడ్డి మాట్లాడుతూ- హైదరాబాద్, ఊటి, అమెరికాలో జరిగిన షూటింగ్తో చిత్రీకరణ పూర్తయింది.