కడప

సిఎంను కలిసిన టిడిపి నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూన్ 22:ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు గురువారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పర్యటన ముగించుకుని చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తూ కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈసందర్భంగా అధికారులు, జిల్లా నేతలు ఆయనకు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. గురువారం ఉదయం 11.35గంటలకు హెలికాఫ్టర్ ద్వారా సిఎం విమానాశ్రయానికి చేరుకోగా జిల్లా కలెక్టర్ టి.బాబూరావునాయుడు , పౌరసరఫరా రాష్ట్ర సంస్థ చైర్మన్ ఎం.లింగారెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసారెడ్డి (వాసు), ప్రకాశం జిల్లా ఎస్పీగా వెళ్తున్న సత్యయేసుబాబు, డిఎస్పీ ఇజి అశోక్‌కుమార్, ఆర్డీఓ చిన్నరాముడు, టిడిపి జిల్లా ప్రధానకార్యదర్శి బి.హరిప్రసాద్, వైవియు పాలక మండలి సభ్యులు, పార్టీ రాష్టక్రార్యనిర్వాహణ అధికారి ఎస్.గోవర్దన్‌రెడ్డి, నేతలు సుభాన్‌బాషా, జిలానీబాషా తదితరులు ముఖ్యమంత్రిని కలిశారు. ముఖ్యమంత్రి జిల్లా అధికారులతో రెండునిమిషాలపాటు మాట్లాడిన అనంతరం చిత్తూరు జిల్లాకు ఉదయం 11.45గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు.