కడప

పులివెందులలో జంట హత్యల కలహలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, మార్చి 21: పులివెందుల పట్టణంలో జంట హత్యలతో ప్రజల్లో భయాందోళలనలు గురయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి అశోక్‌బాబు (25), ఖాదరబాష (26) హత్యకు గురైయ్యారు. అర్బన్ సీఐ పుల్లయ్య వివరాల మేరకు... పట్టణంలోని జయమ్మకాలనీకి చెందిన మునిసాతో మృతుడు అశోక్‌బాబుకు వివాహం జరిగినది. గత మూడు సంవత్సరాల క్రితం వీరు విడాకులు తీసుకున్నారు. మున్నీసా నాగరాజుతో మళ్ళీ వివాహం చేసుకుంది. మొదటి భర్త అశోక్‌బాబు రోజూ వేదింపులకు గురిచేస్తున్నారని ఆ విషయము భర్త నాగరాజుకు చెప్పడంతో అతనిని మందలించడం జరిగింది. కానీ అతని ప్రవర్తన మారకపోవడంతో రాళ్ళతోకొట్టి అశోక్‌బాబును హత్య చేయడం జరిగిందన్నారు. కానీ ఖాదరబాష హత్య వివరాలుపై మిస్టరీగానే ఉందని తెలిపారు. ఖాదరబాష స్నేహితులతో కలిసి మద్యం సేవించి ఫోన్ రావడంతో వెళ్ళిపోయారని అతని స్నేహితులను ఆరాతీస్తేనే విషయం బయటకు వస్తుందన్నారు. ఖాదరబాష రోడ్డుపై మృతిచెందడంతో రోడ్డు ప్రమాదమా లేక హత్యా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టుకోసం తరలించారు. బంధువుల పిర్యాదుల మేరకు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితులు నాగరాజు, అతని స్నేహితుడు బాష పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. మృత దేహాలను మాజీమంత్రి వైయస్ వివేకానందరెడ్డి పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. హత్యకు కారణమైన వారిని శిక్షించాలని పోలీసులను కోరారు.