Others
సుందరకాండ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాహ్యదృష్టితో చూస్తే శబ్దాడంబరాది అలంకారాలు కనబడతాయి. ఇది సుందరకాండలో ఎక్కువ. ఈ లక్షణం రావణ ప్రకృతిని లంకా బాహ్య సౌందర్యాన్ని కవి స్థూలంగా చూసెట్టే విధానమని మనం భావించుకోవాలి.
ఆ వెనె్నట్లో స్వామి పిల్లిమొగ్గలు వేస్తూన్నట్లే ఈ వర్ణన బాహ్య స్వరూపం కూడా కనబడుతుంది. ఇక్కడినుండి పురస్థలయిన స్ర్తిలను చూస్తూ బయలుదేరేడు.
అయితే వారెలా ఉన్నారు.
భర్తలతో కలిసి మాదకద్రవ్యాల్ని సేవిస్తూన్నవాళ్లు, సంగీత సాధనలు చేస్తూన్నవాళ్లు, అధిక్షేపించుకొంటూన్నవాళ్ళు, మాటా మాటా వచ్చి విరహాన్ని అనుభవిస్తున్నవాళ్ళూ-తిరిగి కలుస్తూన్నవాళ్ళు-ఇటువంటి వారి ముఖాలను చూస్తూ వారి ఆభరణాల్నిచూస్తూ స్వామి ముందుకు వెళుతున్నాడు.
ఆ తల్లి సీతాముఖ లక్షణాల్ని తానెరుగును. ఆ తల్లి ఆభరణాలు తనకు పరిచయమున్నాయి. ఆ రెండూ కాని మూడవ గుర్తు తన వద్ద లేదు. ఈరెండూ కాని మూడవ విషయం స్ర్తి విషయంలో తనకు లేదు.
కనుక స్వామి కనబడిన స్ర్తి ముఖాన్ని చూస్తున్నాడు. ఆభరణాల్ని చూస్తున్నాడు. కాని రామపత్ని తనకు కనబటంలేదు. ఎటువంటి రామపత్నిని తాను చూడాలి.
ఉష్ణార్దితాం సాను స్రుతార్ద్ర కంఠీం
పురావరార్సోత్తమ నిష్కంఠీం
సుజాత పక్ష్మామభిరక్త కంఠీం
వనే ప్రవృత్తామివ నీల కంఠీమ్
అవ్యక్త రేఖామివ చన్ద్ర రేఖాం
పాంశుప్రదిగ్థామివ హేమరేఖాం
క్షతప్రరూఢా మివ బాణ రేఖాం
వాయుప్రభిన్నామివ మేఖ రేఖామ్
ఇటువంటి రామపత్నిని తాను చూడాలట.
వెచ్చని కన్నీటితో తడుపబడుతూన్న కంఠం కలది.
కంఠం నుండి వక్షస్థలం వరకు ఉత్తమమైన హారం కలది.చక్కని కనుబొమలు స్నిగ్ధమైన కంఠమూ కలది.
అడవిలో నటించే నెమలి వంటిది.
కనబడీ కనబడనట్టి చంద్రరేఖ వంటిది.
బురదలో దిగబడ్డ బంగారు కణికి వంటిది.
గాయాన్ని నరేపిన బాంవు గుర్తుగలది.
గాలిరేపని మేఘరేఖ వంటిది-ఇటువంటి రామపత్నిని తాను చూడాలట-ఇదీ కోరిక- ఇదొక విచిత్రమైన కోరిక.
ఆంజనేయస్వామి సీతా స్వరూపాన్ని సుందరకాండలో మూడు స్థాయిలో ధ్యానిస్తాడు. మొదట సగుణ స్వరూపంగా ఆ తరువాత సగుణ నిర్గుణ స్వరూపంగా ఆపై నిర్గుణ స్వరూపంగా దర్శిస్తాడు. వానిలో మొదటి స్థితి ఇది.
ఇపుడు స్వామి ధ్యాన స్థితి యొక్క ఆంతర్యాన్నిగమనిస్తే, కనిపించీకనిపించని చంద్రరేఖ శుక్ల విదియనాటిది. ఇది చూడాలనిప్రయత్నిస్తే కనబడుతుంది. తనంతట తనా కనబడదు.అలాగే ఆతల్లిని ఉపాసిస్తే కనబడుతుంది.కనుక ఉపాసకులకు మాత్రమే కనబడేదని భావం.
బురద అంటిన హేమరేఖ. హేమమంటే తేజస్సు. పరబ్రహ్మ స్వరూపిణి అయి నిర్గుణ నిరాకార స్థితియందున్న ఆమెకు సృష్టి లక్షణం సంసార స్థితి వస్తుంది.అది బురద. అది బంగారు కణికకు అంటినట్లుంటుంది. అంటదు. అట్టిలక్షణమున్న తల్లిని చూడాలని స్వామి కోరిక.
గాయాన్ని రేపిన బాణపు గుర్తు.ఆమె వీరారాధ్య.
వీరులంటేవేదాంతులు. శోక తాపాలు రాగద్వేషాలు లేనివారు.
అట్టివారికి మాత్రమేఆరాధ్య.
గాలి రేపిన మేఘ పంక్తి అంటే ప్రాణాయామాదుల చేత మాత్రమే చిక్కేది. అనగా యోగ లభ్య. అట్టి తల్లిని చూడాలి.
ఇంకావుంది...