కడప

శ్రీశైలంలో నీటిమట్టం స్థిరీకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట, జూలై 28:శ్రీశైల జలాశయంలో నీటిని స్థిరీకరించాలని కోరుతూ బస్టాండు కూడలిలో గురువారం రైతు నాయకులు ధర్నా చేపట్టారు. ధర్నా అనంతరం వారు మాట్లాడుతూ రాయలసీమకు నీరు వచ్చేందుకు 854 అడుగుల సామర్థ్యం డ్యామ్‌లో ఉంటేనే విడుదల చేస్తామని చెబుతున్న నేతలు ఆ సామర్థ్యాన్ని స్థిరీకరించాలని కోరారు. 854 అడుగులు స్థిరీకరించకుండా నాగార్జునసాగర్‌కు ఎలా వదులుతున్నారని ప్రశ్నించారు. రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రి రాయలసీమ రైతాంగానికి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ఈకార్యక్రమంలో రైతు నాయకుడు ఎరికలరెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.