కడప

ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు రూరల్, జూలై 29: ప్రొద్దుటూరు పట్టణంలోని నాగేంద్రనగర్‌లో కాపురముంటున్న చంద్రశేఖర్‌రెడ్డి (42), తన కుమారుడు, కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో సంచలనం రేకెత్తించింది. మృతుడు కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు నాగేంద్రనగర్‌కు చెందిన చంద్రశేఖర్‌రెడ్డికి 16 సంవత్సరాల క్రితం తన అక్క కూతురుతో వివాహమైంది. ఇతనికి మంజునాథరెడ్డి (15), హన్సిక (8)అనే ఇరువురు సంతానం కలరు. చంద్రశేఖర్‌రెడ్డికి మేనరికపు వివాహం కావడంతో ఇతని బిడ్డలకు కండరాలకు సంబంధించిన వ్యాధి వచ్చిందని, ఎందరు వైద్యులకు చూపించినా ఫలితం లేకపోవడంతో ఇతని భార్య 2013లో విషపు గుళికలు తిని ఆత్మహత్య చేసుకుందన్నారు. అనంతరం ముద్దనూరుకు చెందిన చెందిన మరో మహిళను చంద్రశేఖర్‌రెడ్డి వివాహం చేసుకున్నాడని, వీరికి మూడు సంవత్సరాల వయస్సు గల కుమారుడు ఉన్నట్లు తెలిపారు. గత కొద్దికాలంగా అనారోగ్య సమస్యలకు ఆర్థిక పరమైన సమస్యలు కూడా తోడవడంతో జీవితంపై విరక్తి చెంది గురువారం సాయంత్రం తన కుమారుడు మంజునాధరెడ్డి, కుమార్తె హన్సికలను తీసుకొని కోగటం గ్రామం వద్ద గల ఓ దేవాలయంలో విష ద్రావణం తాగారన్నారు. అపస్మారకస్థితిలో పడి వున్న వీరిని గుర్తించిన కుటుంబ సభ్యులు 108 వాహనం ద్వారా గాంధీరోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. శుక్రవారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ వీరు ముగ్గురూ మరణించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందడంతో స్థానికులను కలచివేసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.