కడప

ఎర్రచందనం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైల్వేకోడూరు, జూలై 31:మండలంలోని బాలుపల్లె సమీపంలో ఆదివారం కూంబింగ్ నిర్వహిస్తుండగా తమిళనాడుకు చెందిన ఒక స్మగ్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రూ. 2 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను పట్టుకున్నట్లు ఎస్సై రమేష్‌బాబు తెలిపారు. తమిళనాడు ధర్మపురికి చెందిన సుబ్రమణ్యం అనే స్మగ్లర్‌ను అరెస్టు చేసి 6 ఎర్రచందనం దుంగలు పట్టుకున్నామన్నారు. స్మగ్లర్ 40 మంది కూలీలతో అటవీ ప్రాంతంలోకి వచ్చాడని, కూలీలంతా పరార్ అయ్యారన్నారు. స్మగ్లర్ కోడూరు నుండి ఎర్రచందనాన్ని చైనాకు మరి కొంత మంది స్మగ్లర్ల ద్వారా రవాణా చేస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై ప్రదీప్, హెచ్‌సి రామసుబ్బయ్య, చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. సోమవారం స్మగ్లర్‌ను కోర్టులో హజరు పరచనున్నట్లు ఎస్సై తెలిపారు.