కడప

పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు : ఎంపిడిఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్కిరెడ్డిపల్లె,సెప్టెంబర్ 23: మండలంలోని పారిశుద్ధ్యం పనులు వెంటనే చేపట్టాలని స్థానిక ఎంపిడివో సభాభవన్‌లో ఎంపిడివో స్వరూప్ పేర్కొన్నారు. శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్దప్రాతిపదికన వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులవల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అధికారులు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలన్నారు. తహశీల్దార్ శ్రీరాములునాయక్ మాట్లాడుతూ దోమల నివారణపై ప్రజల్లో చైతన్యం తేవాలని వారికి అవగాహన కల్పించాలన్నారు. మండల విద్యాధికారి చక్రానాయక్ మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య సమస్యలను విద్యార్థులకు కూడా వివరించి వ్యక్తిగత పరిశుభ్రత అలవర్చుకునేలా ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేయాలన్నారు. మురుగునీరు నిల్వలు పరిశీలించి దోమల నివారణకోసం చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు, సర్పంచ్‌లు, ఏపిఎం రెడ్డమ్మ, ఏపిఓ సుధారాణి పాల్గొన్నారు.