S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తజికిస్థాన్‌లో భూకంపం

తజికిస్థాన్‌ : తజికిస్థాన్‌లో శనివారం భూకంపం కారణంగా 30 ఇళ్లు, పాఠశాల భవనాలు ధ్వంసమయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం నమోదు కాలేదు. దేశ రాజధానికి 200 కిలోమీటర్ల దూరంలో రాషిట్‌ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

సీజేఐతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి భేటీ

దిల్లీ: తెలంగాణలో న్యాయాధికారుల నియామకాలపై నిరసనల నేపథ్యంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి దిలీప్‌ భోసలే శనివారం భేటీ అయ్యారు. న్యాయాధికారుల సస్పెన్షన్‌ తదనంతర పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.

డ్రంక్ అండ్ డ్రైవ్లో 8 మంది అరెస్ట్

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 8 మందిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. 3 కార్లు, 4 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు మృతి

ఖమ్మం : మట్టి పెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు మృతి చెందిన సంఘటన సింగరేణి ఇల్లందు ఏరియా జేకే ఉపరితలగనిలో శనివారం చోటుచేసుకుంది. ఉపరితల గని చుట్టూ పోసిన మట్టిని తీస్తుండగా, మట్టి పెళ్లలు కూలీలపై పడటంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

ఢాకాలో అయిదుగురు ఉగ్రవాదులు హతం

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ రెస్టారెంటులో బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు పోలీసు కమెండోలు రంగప్రవేశం చేసి అయిదుగురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. శుక్రవారం రాత్రి ఆ రెస్టారెంటులో 8 మంది ఉగ్రవాదులు ప్రవేశించి 18 మంది విదేశీయులను బంధించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇద్దరు పోలీసులు మరణించగా, 20 మంది గాయపడ్డారు. ఓ ఉగ్రవాది పోలీసులకు పట్టుబడగా మరో ఇద్దరు ముష్కరులు పరారయ్యారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు బంగ్లా ప్రధాని షేక్ హసీనా తెలుసుకుంటున్నారు.

నేడు విశాఖలో చంద్రబాబు బిజీ

విశాఖ: ఎపి సిఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఇక్కడికి చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడికి చేరుకుంటారు. అనంతరం నగరంలోని ఓ హోటల్‌లో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో జరిగే సమావేశంలోను, నౌకాదళ అధికారుల సమావేశంలోనూ పాల్గొంటారు. తర్వాత బీచ్‌రోడ్డులో బే మారథాన్‌ను ప్రారంభిస్తారు. రాత్రికి తిరిగి విజయవాడ చేరుకుంటారు.

బంగ్లాదేశ్‌లో మరో పూజారిపై దాడి

ఢాకా: బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గమైన హిందూ పూజారులపై దాడులు నానాటికీ పెచ్చుమీరుతున్నాయి. శుక్రవారం ఓ పూజారిని హత్యచేయగా, తాజాగా శక్తిరా జిల్లాలోని రాధాగోవింద ఆలయ పూజారి బాబాసిందూరాయ్‌పై ఆగంతకులు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఇంటి తలుపులు కొట్టగానే బయటికి వచ్చిన పూజారిపై దుండగులు విరుచుకుపడ్డారు. గాయపడిన పూజారిని ఆస్పత్రిలో చేర్పించగా అతడి పరిస్థితి విషమంగానే ఉంది. బంగ్లాదేశ్‌లో హిందూ, బౌద్ధ, క్రైస్తవ పూజారులపై దాడులు జరుగుతున్నందున మైనారిటీ ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు.

బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు: ఒకరి మృతి

సికింద్రాబాద్: బోయిన్‌పల్లి చెక్‌పోస్టు వద్ద శనివారం ఉదయం వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో షాపూర్‌నగర్‌కు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినందునే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేసి, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

స్వాతి హత్యకేసులో నిందితుడి అరెస్టు

చెన్నై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకేసులో అనుమానితుడైన రామ్‌కుమార్ (24)ను చెన్నై పోలీసులు తిరునెల్వేలిలో ఎట్టకేలకు అరెస్టు చేశారు. పోలీసులను చూడగానే బ్లేడుతో గొంతుకోసుకుని నిందితుడు ఆత్మహత్యకు యత్నించి గాయపడడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడు కోలుకున్న తర్వాత పోలీసులు విచారణ జరిపితే హత్యకు దారితీసిన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. గత నెల 24న నుగంబాక్కం రైల్వే స్టేషన్‌లో పట్టపగలు అందరూ చూస్తుండగానే స్వాతిని ఓ ఆగంతకుడు కత్తితో పొడిచి హత్య చేసిన సంగతి తెలిసిందే.

రేణిగుంట చేరుకున్న జగన్

తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అనంతరం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు బయలుదేరారు. సూళ్లూరుపేటకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దబ్బళ రాజిరెడ్డి అంత్యక్రియల్లో జగన్ పాల్గొంటారు.

Pages