ముంచుకొస్తున్న ముహూర్తం!
Published Wednesday, 1 June 2016విజయవాడ, మే 31: వచ్చే నెల 27కల్లా రాజధాని అమరావతికి తరలిరావాలని సెక్రటేరియట్ ఉద్యోగులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో ఇందు కు సంబంధించిన పనులు చకచకా సాగుతున్నాయి. జూన్లో సుమారు నాలుగు వేల మంది ఉద్యోగులు ఇక్కడికి చేరుకోవలసి ఉంది. అలాగే 54 సెక్రటేరియట్లు, 110 హెచ్ఓడి కార్యాలయాలు విజయవాడకు రావల్సి ఉంది. ప్రస్తుతం ఆయా శాఖల కేంద్ర కార్యాలయాలను విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఏర్పాటు చేసుకోవాలని, సీడ్ క్యాపిటల్ వద్ద భవనాలు సిద్ధమైన తరువాత పూర్తి స్థాయిలో ఆయా శాఖలకు శాశ్వత భవనాలు కేటాయిస్తామని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు.