అధికారులు సమన్వయంతో పనిచేయాలి
Published Wednesday, 1 June 2016హైదరాబాద్, మే 31: ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రోడ్డు భద్రత సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, శాఖల మధ్య సమన్వయం ఉండి, ఎప్పటికప్పుడు సమాచారం అందించుకోవడంతోనే రోడ్డు భద్రత సాధ్యమవుతుందని అన్నారు. వచ్చేనెల 4వ తేదీలోపు ఎ-కేటగిరిగా గుర్తించిన రోడ్డు ప్రమాద స్థలాలను సంబంధిత శాఖలు ఉమ్మడిగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని చెప్పారు.