-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
కాబూల్, మే 31: అఫ్గానిస్తాన్ జట్టుకు అంతర్జాతీయంగా మరింత పేరు వచ్చేందుకుగాను, ఇకనుంచి భారత్లో పర్యటనకు వచ్చే ప్రతి అంతర్జాతీయ జట్టు అఫ్గానిస్తాన్ జట్టుతో ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాలని బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి స్పష్టం చేశాడు. ఆఫ్గానిస్తాన్ పర్యటనలో ఉన్న అతను ఈ మేరకు ఒక ప్రకటన చేశాడు. అఫ్గానిస్తాన్ జట్టుకు మరింత పేరు వచ్చేందుకు ఈ ప్రతిపాదన చేసిన్నట్లు పేర్కొన్నాడు.
లండన్, మే 31: క్రికెట్పై ప్రపంచవ్యాప్తంగా యువత మరింత మక్కువ చూపుతున్నారని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ అన్నాడు. రానున్న రోజుల్లో క్రికెట్పై యువతలో ఆసక్తి, మక్కువ తగ్గుతుందని అంటూ ఇటీవల ఇంగ్లాండ్ అగ్రశ్రేణి క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
లండన్, మే 31: ఇంగ్లాండ్తో శుక్రవారంనాడు హెడ్డింగ్లేలో నిర్వహించే రెండో టెస్టు మ్యాచ్లో ఘన విజయం సాధిస్తామని, ఇది తప్పకుండా తమకు మరపురానిదిగా నిలుస్తుందని పాకిస్తాన్ క్రికెట్ జట్టు పేసర్ మహమ్మద్ అమీర్ అన్నాడు. లార్డ్స్ మైదానంలో ఇటీవల జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో తొమ్మిది వికెట్ల తేడాతో పాక్ గెలుపొందింది.
టోక్యో, మే 31: టోక్యో ఒలింపిక్స్ 2020 మహిళలు, పురుషుల మారథాన్ కొత్త ఒలింపిక్ స్టేడియంలోనే ప్రారంభమై ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు. నిర్వాహకుల కమిటీ గురువారం ఇందుకు సంబంధించి ప్రణాళికను విడుదల చేసింది. కొత్త మైదానం నిర్మాణంలో ఉందని, అప్పటిలోగా పూర్తవుతుందన్నారు. టోక్యో నగరంలో ఉష్ణోగ్రతల దృష్ట్యా మారథాన్ను ఉదయం 7.30 నుంచే ప్రారంభించనున్నట్లు పేర్కొంది.
ప్యారిస్, మే 31: ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత తరఫున బరిలోకి దిగిన యూకీబాంబ్రీ, దివిజ్ శరణ్ రెండ్ రౌండ్లో ఫాబ్రిస్ మర్టిన్, పురవ్ రాజాతో తలపడనున్నారు. బాంబ్రీ, శరన్ మహారాష్ట్ర ఓపెన్లో రాజా, మార్టిన్పై 6-3 5-7 6-4 సెట్ల తేడాతో మొదటి రౌండ్లో గ్రాండ్స్లామ్ను గెలుచుకున్నారు. ఆ తర్వాతి రౌండ్లో వీరిద్దరూ అలీవర్ మరచ్, మేట్ పేవిక్తో తలపడునున్నారు.
న్యూఢిల్లీ, మే 31: నెదర్లాండ్లోని బ్రెడాలో జూన్ 23 నుంచి జరుగునున్న చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో పాల్గొంటున్న 18 మంది సభ్యులు కలిగిన భారత జట్టులో మాజీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్, మిడ్ ఫిల్డర్ బీరేంద్ర లక్రాకు స్థానం కల్పించింది హాకీ ఇండియా. ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నమెంటులో పాల్గొంటున్న భారత జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.
న్యూఢిల్లీ, మే 31: మణిపూర్కు చెందిన ఫెన్సింగ్ క్రీడాకారిణి కెహెచ్.కలాంబీయా ఛానుకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ ఆర్థిక సహాయం చేశాడు. ఆమె బహుళ స్క్లెరోసిస్తోతో తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆర్థిక స్తోమత భాగా లేక వైద్య చికిత్సలు చేసుకోలేని పరిస్థితుల్లో ఉంది. పోటీల్లో పాల్గొనకుండా దుర్భర జీవనం గడుపుతోంది.
పారిస్: ఇక్కడ మంగళవారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో కెనడా టీనేజర్ డెనిస్ షాపోవాల్వోవ్ 7-5 6-4, 6-2 తేడాతో ప్రత్యర్థి, ఆస్ట్రేలియాకు చెందిన జాన్ మిలన్పై సంచలన విజయం సాధించాడు. 19 ఏళ్ల కెనడా టీనేజర్ డెనిస్ గత ఏడాది రొనాల్డ్ గారోస్పై జరిగిన పోటీలో ఓటమి చెందినా ప్రస్తుతం 24వ సీడ్గా బరిలోకి దిగాడు.
ముంబై, మే 29: గత సంవత్సరం హరికేన్ తుఫాన్ బీభత్సంతో కరేబియన్లోని అనేక క్రికెట్ స్టేడియంలకు తీవ్ర నష్టం వాటిల్లిన నేపథ్యంలో వాటిని ఆధునికీకరించడానికి అవసరమైన నిధుల సేకరణ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చారిటీ మ్యాచ్ను నిర్వహిస్తోంది. ఇంగ్లాండ్ లార్డ్స్ వేదికగా ఈనెల 31 ఈ మ్యాచ్లో వెస్టిండీస్తో ప్రపంచ ఎలెవన్ జట్టు తలపడనుంది.
ఢాకా, మే 29: వచ్చే నెలలో అఫ్గానిస్తాన్తో జరిగే టీ20 సిరీస్కి బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ఋస్తాఫిజుర్ రెహమాన్ కాలి గాయం కారణంగా దూరమయ్యాడు. ఐపీఎల్11 సీజన్లో ముంబయ ఇండియన్స్ తరఫున బరిలో దిగిన రెహమాన్ లీగ్ నుంచి జట్టు నిష్క్రమించిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లాడు. గత వారం జరిగిన నేషనల్ ట్రెయనింగ్ క్యాంప్లో కాలి నొప్పితో పాల్గొనలేకపోయాడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పేర్కొంది.