-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
న్యూఢిల్లీ, మే 29: టీమిండియాతో జూన్ 14న బెంగళూరులో నిర్వహించనున్న టెస్టు మ్యాచ్లో తొలిసారిగా అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు ఆడనున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన ఇద్దరు స్టార్ క్రికెటర్లకు ఇందులో చోటుదక్కింది. 15 మంది అఫ్గాన్ జట్టు సభ్యులు కలిగిన టీమ్లో వరల్డ్ ప్రీమియర్ టీ-20 స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్తోపాటు మరో యువ క్రికెటర్ 17 ఏళ్ల ముజీబ్ ఉర్ రహ్మాన్కు కూడా స్థానం దక్కింది.
సిడ్నీ, మే 29: దక్షిణాఫ్రికాతో గత మార్చిలో జరిగిన టెస్టు మ్యాచ్లో బాల్ ట్యాంపరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్క్రాఫ్ట్ మళ్లీ బ్యాట్ పట్టనున్నారు. అయితే, ఇది సాధారణమైన పరిమితి ఓవర్లు కలిగిన టోర్నమెంట్లో మాత్రమే వారు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ మ్యాచ్ జూలై 21, 22 తేదీల్లో జరుగనుంది.
చెన్నై, మే 29: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రస్తుత సీజన్లో ఈనెల 27న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఫైనల్లో అద్భుత విజయంతో ఐపీఎల్ ట్రోఫీని అందుకున్న మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
న్యూఢిల్లీ, మే 29: బహ్రెయిన్, యూఏఈ వంటి బలమైన ఫుట్బాల్ జట్లతో తలపడడం చాలా కష్టమేనని, అయినా భారత క్రీడాకారులు ప్రత్యర్థికి గట్టి పోటీ ఇస్తారనే నమ్మకం తనకు ఉందని జాతీయ ఫుట్బాల్ కోచ్ స్టీఫెన్ కాన్స్టంటైన్ అన్నాడు. వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ పోటీలో భారత ఫుట్బాల్ జట్టులోని సునీల్ ఛెత్రి, అతని సహచర ఆటగాళ్లు అత్యధిక గోల్స్ చేస్తారని విశ్వసిస్తున్నామని ఆయన పేర్కొన్నాడు.
ముంబయి, మే 29: ప్రో కబడ్డీ ఆరో సీజన్కు సంబంధించి ఆటగాళ్ల కొనుగోలు కోసం వేలం బుధ, గురువారాల్లో ఇక్కడ జరుగనుంది. ఆరో ప్రో కబడ్డీ నిర్వహణ కోసం మొత్తం 422 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు కొనుగోలు చేయనున్నాయి.
న్యూఢిల్లీ, మే 29: వచ్చేనెల 15న బెంగళూరులో అఫ్గనిస్తాన్తో జరిగే టెస్టు మ్యాచ్లో భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా ఆడేది అనుమానమే. కోల్కతా నైట్ రైడర్స్తో ఈనెల 25న జరిగిన ఐపీఎల్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరఫున ఆడిన సాహా గాయపడ్డాడు. దీంతో అతని కుడిచేతి బొటనవేలి గాయమైంది. ప్రస్తుతం సాహా బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు.
ముంబయిలో సోమవారం రాత్రి జరిగిన సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డు నైట్ కార్యక్రమంలో యాంకర్తో కలసి డ్యాన్స్ చేస్తున్న క్రికెటర్లు క్రిస్ గేల్, శిఖర్ ధావన్, అజింక్య రహానే, రషీద్ ఖాన్, అండర్-19 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంటున్న శుభ్మాన్ గిల్,
పాపులర్ చాయస్ ఆఫ్ ది ఇయర్ 2017-2018 అవార్డును స్వీకరిస్తున్న క్రిస్ గేల్
న్యూఢిల్లీ: ఇంతవరకు ఏ క్రీడాకారిణి ఎదుర్కోని పరిస్థితులను కెరీర్ పరంగా కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్టు మీరాబాయి ఛాను ఎదుర్కొంది. ప్రపంచ చాంపియన్గా రాణించడంతోపాటు ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు వెయిట్ లిఫ్టింగ్లో స్వర్ణ పతకాన్ని సంపాదించి పెట్టిన మీరాబాయి ఛానును ఓ తెలియని భయం వెంటాడుతోంది.
చెన్నై, మే 28: ఐపీఎల్-11 సీజన్లో ట్రోఫీని గెల్చుకుని సోమవారం చెన్నైకి చేరుకున్న కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఘన స్వాగతం లభించింది.
ముంబయి, మే 28: వయసుతో పనేముంది.. ఫిట్నెస్ బాగుంటే ఎలాంటి మ్యాచ్నైనా గెలవగలమన్న ధీమా ఆటగాళ్లలో ఉండాలని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, టీమిండియా బ్యాట్స్మన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ఫిట్నెస్ బాగుండడంతో తమ జట్టు ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సన్రైజర్స్పై విజయం సాధించిందని పేర్కొన్నాడు.