-
మాడ్రిడ్, మార్చి 22: కరోనా మహమ్మారి ప్రపంచ క్రీడా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రీడాభూమి
ఇంగ్లాండ్, మే 26: ఇక్కడి లార్డ్స్ మైదానంలో పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో ఆతిధ్య జట్టు ఇంగ్లాండ్ ఆట 76 ఓవర్లు ఆడేటప్పటికి ఆరు వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి, 76 పరుగుల ఆధిక్యంతో ఉంది. ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ను ప్రారంభించిన పాక్ తొలి ఇన్నింగ్స్లో 114.3 ఓవర్లలో 363 పరుగులకు ఆలౌట్ అయింది.
న్యూఢిల్లీ, మే 26: అంతర్జాతీయ క్రికెట్కి ఏబీ డివిలియర్స్ వీడ్కోలు పలికిన తరువాత, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సహచరుడు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తనదైన శైలిలో స్పందించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘బ్రదర్ నువ్వు చేసే ప్రతి పనిలో మంచి జరగాలని ఆశిస్తున్నాను.
కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో శుక్రవారం కోల్కతా ఈడెన్ గార్డెన్లో ఆతిధ్య జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 13 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మెల్బోర్న్, మే 25: దక్షిణాఫ్రికాలోకి కేప్ టౌన్లో ఆతిధ్య జట్టుతో గత మార్చిలో జరిగిన టెస్టు మ్యాచ్లో జరిగిన బాల్ ట్యాంపరింగ్ వివాదంలో పాత్ర ఉన్నట్టు రుజువు కావడంతో ఏడాది కాలం పాటు నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మళ్లీ క్రికెట్లో అడుగుపెట్టనున్నాడు. జూన్ 28 నుంచి ప్రారంభం కానున్న కెనడా గ్లోబల్ టీ-20 లీగ్ మ్యాచ్లో అతను ‘మాక్వీ’ ఆటగాళ్లతో కలసి ఆడనున్నాడు.
న్యూఢిల్లీ, మే 25: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ యంత్రం కాదని, అతనిని కూడా ఒక మనిషిగా గుర్తించాలని కోచ్ రవి శాస్ర్తీ అన్నాడు. ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్తో ఈనెల 17న జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లీ మెడకు గాయమైన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ. మే 25: నేషనల్ షూటింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కేరళలో జరగాల్సిన కుమార్ సురేంద్ర సింగ్ మెమోరియల్ 18వఛాంపియన్ షిప్ టోర్నీని నిఫా వైరస్ ముప్పు పొంచి ఉండడంతో ఢిల్లీకి తరలించారు. చాంపియన్షిప్లో భాగంగా రైఫిల్, పిస్టోల్ షుటర్స్ షెడ్యూల్ను మే 31 నుంచి జూన్ 18వరకు తిరువనంతపురంలో జరగాల్సి ఉంది. జూన్ రెండో వారంలో డా.కర్ణి సింగ్ షుటింగ్ జరగనుంది.
బార్సిలోనా, మే 25: ఒకేసారి ఇద్దరు మహిళలను పెళ్లాడనున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, అదో పెద్ద అబద్ధమని బ్రెజిల్ మాజీ సూపర్ స్టార్, బార్సిలోనా ఫుట్బాల్ సూపర్ స్టార్ రొనాల్డినో స్పష్టం చేశాడు.
ఇంగ్లాండ్, మే 25: ఇక్కడి లార్డ్ మైదానంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు శుక్రవారం పాకిస్తాన్ 162 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలిరోజు గురువారం 58.2 ఓవర్లలో 184 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ను ప్రారంభించిన పాక్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. ఇమాముల్ హక్ నాలుగు పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇప్పటికే రెండుసార్లు చాంపియన్గా అవతరించిన కోల్కతా నైట్ రైడర్స్ శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్పై దృష్టి సారించింది. ఈ పోరులో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనున్న కోల్కతా గెలుపుపై ధీమాతో ఉంది. రౌండ్ రాబిన్ లీగ్లో సన్రైజర్స్, కోల్కతా విజయాలను నమోదు చేసుకున్నాయి.
లండన్, మే 24: ఇంతవరకు తన పేరిట ఉన్న 153 టెస్టు మ్యాచ్లు ఆడిన రికార్డును సమం చేసినందుకు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ అలన్ బోర్డర్ ఇంగ్లాండ్ క్రికెటర్ అలస్టెయిర్ కుక్కు అభినందనలు తెలిపాడు. గురువారం ఇక్కడి లార్డ్స్ మైదానంలో పాకిస్తాన్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో కుక్ ఓపెనర్గా బరిలోకి దిగాడు. అలన్ బోర్డర్ ఇంతవరకు తన క్రికెట్ క్రీడా జీవితంలో 153 టెస్టు మ్యాచ్లు ఆడాడు.